ఘోరం.. అంబులెన్స్‌ ను ఢీకొని బైక్.. దంపతుల దుర్మరణం..

Published : May 21, 2023, 11:41 PM IST
ఘోరం.. అంబులెన్స్‌ ను ఢీకొని బైక్.. దంపతుల దుర్మరణం..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్  రైడర్ దంపతులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.   

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో బైక్ రైడర్ దంపతులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని ఠాణా కత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాంగ్‌పూర్ గ్రామానికి చెందిన రమాకాంత్ తివారీ (50), అతని భార్య ఉషా తివారీ (48)తో కలిసి మహామృత్యుంజయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నట్లు కల్నల్‌గంజ్ పోలీసు అధికారి (CO) నవీనా శుక్లా తెలిపారు. 

దారిలో గోండా-లక్నో రహదారిపై, కల్నల్‌గంజ్ పట్టణానికి పిప్రి పెట్రోల్ పంప్ సమీపంలో ఓ అంబులెన్స్ తన మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాకాంత్, అతని భార్య ఉష తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా,రమాకాంత్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందినట్లు జ్యూరిస్డిక్షన్ అధికారి తెలిపారు. రమాకాంత్ బంధువు, న్యాయవాది హృదయ్ నారాయణ్ మిశ్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?