గుజరాత్‌ పాలన్ పూర్ లో కూలిన బ్రిడ్జి: కొనసాగుతున్న సహాయక చర్యలు

Published : Oct 23, 2023, 07:38 PM ISTUpdated : Oct 23, 2023, 07:48 PM IST
 గుజరాత్‌ పాలన్ పూర్ లో కూలిన బ్రిడ్జి: కొనసాగుతున్న సహాయక చర్యలు

సారాంశం

గుజరాత్ రాష్ట్రంలోని పాలన్ పూర్ లో నిర్మాణంలో ఉన్న వంతెన  ఇవాళ కుప్పకూలింది.  

గాంధీనగర్:గాంధీనగర్:గుజరాత్ రాష్ట్రంలోని  పాలన్ పూర్ లో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది.   సోమవారంనాడు  బ్రిడ్జిలో ఒక భాగం కుప్పకూలింది.  ఈ ఘటనతో  బ్రిడ్జి శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే  సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.పాలన్ పూర్ లోని ఆర్టీఓ సర్కిల్ ఏరియాలో  ఈ ఘటన చోటు చేసుకుంది.ట్రాక్టర్, ఆటోరిక్షాలపై  బ్రిడ్జి శిథిలాలు పడ్డాయి. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు హుటాహుటిన చేరుకున్నారు.  సహాయక చర్యలను  ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 

బ్రిడ్జిలో  కొంత భాగం కూలిపోవడంపై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  నాణ్యత సరిగా లేని కారణంగా బ్రిడ్జి కూలిపోయిందా లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయాలపై  అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu