రాష్ట్రప‌తిగా ఎన్నికైతే సీఏఏను అడ్డుకుంటా.. చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు: య‌శ్వంత్ సిన్హా

Published : Jul 14, 2022, 11:32 AM IST
రాష్ట్రప‌తిగా ఎన్నికైతే సీఏఏను అడ్డుకుంటా.. చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు: య‌శ్వంత్ సిన్హా

సారాంశం

Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని యశ్వంత్ సిన్హా అన్నారు. తాను ఎన్నికైతే, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కాకుండా చూస్తానంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.   

Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన ప్రత్యర్థి, ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బలవంతంగా మద్దతిచ్చారని అన్నారు. తన ప్రచారంలో భాగంగా గౌహతిలో విలేకరులతో మాట్లాడుతూ "నేను రాజకీయ పార్టీతో పోరాడటం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వంతో" అని అన్నారు. ఉద్ధ‌వ్ థాక్రే మొద‌ట ప్రతిపక్ష అభ్యర్థి య‌శ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు. అయితే, తాజాగా శివ‌సేన‌ పార్టీకి చెందిన 16 మంది ఎంపీల బృందం ఈ వారం మొదట్లో ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకి తన మద్దతును ప్రకటించారు.

థాక్రే మాట్లాడుతూ "ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి, నేను ఆమెకు మద్దతు ఇవ్వాల్సింది కాదు, కానీ మేము సంకుచిత మనస్తత్వం కాదు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నిర్ణ‌యం ఆయ‌న  ప్రభుత్వాన్ని కూల్చి.. తన పార్టీలో పెరుగుతున్న విభజనను ఆపడానికి చేసిన ప్రయత్నంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో రాష్ట్రపతి ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం గత నెలలో కూలిపోయింది. 55 మంది శివ‌సేన ఎమ్మెల్యేలలో 40 మంది షిండేకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను బలహీనపరచడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించిన యశ్వంత్ సిన్హా అన్నారు. "అదంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం గురించి.. ఏజెన్సీలను ఉపయోగించి.. వారు ఎన్నికైన ప్రభుత్వాలను పడగొడుతున్నారు" అని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిన్హా అన్నారు.

అయితే, ప్రాంతీయ పార్టీలు ముర్ముకు ఒకదాని తర్వాత మరొకటి మద్దతు ఇవ్వడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ, సిన్హా ఉత్సాహంగా కనిపించారు. "తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ నాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నుంది. ప్రతిపక్ష శిబిరంలో కేవలం ఒక పార్టీ మాత్రమే NDA అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. అది శివసేన. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపక్ష సమావేశంలో భాగం కాదు, కానీ అది ఇప్పటికీ నాకు మద్దతు ఇస్తోంది, కాబట్టి మాకు చాలా ప్రతిపక్షాల మద్దతు ఉంది”అని సిన్హా అన్నారు. ఇప్పటికే ఆమెకు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చిన పార్టీలను లెక్కిస్తే, ద్రౌపది ముర్ము 60 శాతానికి పైగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఆశించవచ్చు. ఈ జాబితాలో శివసేనతో పాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ కూడా ఉన్నాయి. ముర్ము తన రాష్ట్రం నుండి గవర్నర్‌గా ఉన్నందున జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారని విస్తృతంగా భావిస్తున్నారు.

సీఏఏను అడ్డుకుంటా...! 

తాను రాష్ట్రప‌తిగా ఎన్నికైతే, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కాకుండా చూస్తానని ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. అసోంలో ప్రతిపక్ష శాసనసభ్యులతో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం CAAని మూర్ఖంగా ఆలోచించి తీసుకువ‌చ్చింద‌న్నారు. అసోంకు పౌరసత్వం ప్రధాన సమస్య అని, దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించింది, కానీ ఇంతవరకు తీసుకురాలేకపోయిందని ఆయన అన్నారు.

చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు..! 

చంద్రబాబు నిర్ణ‌యం త‌న‌ను పెద్ద‌గా ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌లేద‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు.  దేశ రాజ‌ధాని ఢిల్లీలో రెండుసార్లు జరిగిన విపక్షాల సమావేశానికి ఆ పార్టీని ఎందుకు పిలవలేదో తనకు తెలియదని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌