Udaipur Murder Case: "హిందూ స‌మాజం ఇలాంటి  దారుణాల‌ను స‌హించ‌దు": శ్రీరామసేన

Published : Jun 30, 2022, 05:50 AM IST
Udaipur Murder Case: "హిందూ స‌మాజం ఇలాంటి  దారుణాల‌ను స‌హించ‌దు": శ్రీరామసేన

సారాంశం

Udaipur Murder Case: ఉద‌య్ పూర్ దారుణం లాంటి ఉగ్రవాద చర్యలను హిందూ సమాజం సహించదని, కేంద్రం జోక్యం చేసుకుని ఘటన వెనుక ఉన్న వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని శ్రీరామసేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. యువ బ్రిగేడ్, హిందూ జన జాగృతి సమితి, ఇతర హిందూ సంస్థలు సంయుక్తంగా గురువారం నుండి నేనే కన్హయ్య లాల్', 'నేను నూపూర్ శర్మ సపోర్టర్' ప్రచారాలను చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.  

Udaipur Murder Case: ఉదయ్‌పూర్‌లో జ‌రిగిన‌ దారుణంగా హత్య ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాంటి ఉగ్రవాద చర్యలను హిందూ సమాజం సహించదని శ్రీరామసేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. హత్యకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 'నేనే కన్హయ్య లాల్', 'నేను నూపూర్ శర్మ సపోర్టర్' ప్రచారాలను చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. హిందూ సమాజంలో రక్తం మరుగుతోంది, కన్నయ్య లాల్‌ను చంపడమే కాకుండా హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్నారని ముతాలిక్ అన్నారు.

ఘటన వెనుక ఉన్న వ్యక్తులను ఉరి తీయాలి: ముతాలిక్

ప్రధాని మోదీని కూడా బెదిరించినందున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఘటన వెనుక ఉన్న వ్యక్తులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. యువ బ్రిగేడ్, హిందూ జన జాగృతి సమితి, శ్రీరామసేన తదితర హిందూ సంస్థలు సంయుక్తంగా గురువారం నుంచి 'నేను కన్హయ్య లాల్', 'నేను నూపుర్ శర్మ మద్దతుదారు' అనే ప్రచారాన్ని ప్రారంభించనున్నాయని తెలిపారు.

మంగళవారం ఉదయ్‌పూర్‌లో పట్టపగలు ఇద్దరు దుండ‌గులు టేలర్‌ను దారుణంగా హత్య చేశారని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారని, అందులో అతను ఇస్లాం మతంపై ప్రతీకారం తీర్చుకున్నాన‌నీ, ఈ హత్యాకాండను సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. హత్యకు పాల్పడిన రియాజ్ అక్తరీ, గౌస్ మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

కఠినంగా శిక్షించాలి: బీజేపీ నేతల డిమాండ్ 

పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు, మంత్రులు హత్యను ఖండిస్తూ.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప డిమాండ్ చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ.. ఉద‌య్ పూర్ హత్య ఘ‌ట‌న అనాగరికం, అమానవీయమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ.. మేధావులుగా చెప్పుకునే వారు ఇప్పుడు ఎందుకు మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు.  రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్.డి. కుమారస్వామి భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసే లక్ష్యంతో జరిగిన ఈ ఘటనను "రాక్షస చర్య"గా అభివర్ణించిన, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉదయ్‌పూర్‌లో అమాయకుడి తల నరికి చంపిన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి క్రూరత్వాన్ని ఎవరూ సమర్థించలేరని, నిందితులను శిక్షించాలని కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System