బండిమీద వెళ్తూ.. కుక్కను లాక్కెళ్లిన మహిళలు.. అరెస్ట్..!

Published : Jul 01, 2021, 08:51 AM IST
బండిమీద వెళ్తూ.. కుక్కను లాక్కెళ్లిన మహిళలు.. అరెస్ట్..!

సారాంశం

ఆ కుక్క స్కూటీ వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. కాగా.. దీనికి సంబంధించి వీడియో సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.

తాము బండి మీద వెళుతూ.. కుక్కను మాత్రం దాని మెడకు బెల్టు కట్టి లాక్కెళ్లారు ఇద్దరు మహిళలు. కాగా... వారిని తాజాగా పోలీసులు అరెస్టు  చేశారు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్ రాష్ట్రం పరిటాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చంచల్, సోనియాలు.. తమ కుక్క మెడకు బెల్టు వేసి.. దానిని స్కూటీకి కట్టేశారు. అనంతరం వారిద్దరూ స్కూటీ పై వెళ్లారు. ఆ కుక్క స్కూటీ వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. కాగా.. దీనికి సంబంధించి వీడియో సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.

జూన్ 20వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా.. కుక్కను అలా లాక్కెళ్లడంతో అది తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో జూన్ 24న అది తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది.  దీంతో.. జంతు సంరక్షణ అధికారులు ఈ ఘటనపై స్పందించారు. కుక్క పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. వారిద్దిరినీ అరెస్టు చేయగా.. వారు బెయిల్ పై బయటకు వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu