Jammu Kashmir Encounter: రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో న‌లుగురు ఉగ్రవాదుల హతం

Published : Jun 17, 2022, 03:00 AM IST
Jammu Kashmir Encounter: రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో న‌లుగురు ఉగ్రవాదుల హతం

సారాంశం

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. గత 24 గంటల్లో లోయలో 6 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.    

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నాలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కాశ్మీర్ జోన్ పోలీసుల కథనం ప్రకారం.. అనంతనాగ్ జిల్లాలోని హంగల్‌గుండ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.

హతమైన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన జునైద్, బాసిత్ భట్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు. గత ఏడాది అనంత్‌నాగ్‌లో బీజేపీ సర్పంచ్ రసూల్ దార్, అతని భార్య, పంచ్‌ను హత్య చేసిన కేసులో ఉగ్రవాది బాసిత్ ప్రమేయం ఉంది.

అదే సమయంలో.. కుల్గామ్‌లోని మిషిపురా ప్రాంతంలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. కుల్గామ్‌లోని మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్‌ను ప్రారంభించాయని పోలీసు ప్రతినిధి తెలిపారు.

భద్రతా బలగాలతో ప్రారంభ ఎదురుకాల్పుల తర్వాత, ఉగ్రవాదులు మిషిపురాలోని సాధారణ ప్రాంతంలో తమ రహస్య స్థావరాన్ని మార్చగలిగారు. అయితే, భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి, దీని తరువాత గురువారం మళ్లీ కాల్పులు జరిగాయి, ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని ప్రతినిధి తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

అంత‌కు ముందు రోజు.. బుధవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు, వీరిలో ఒకరు ఇటీవల బ్యాంక్ మేనేజర్‌ను హతమార్చారు. షోపియాన్ జిల్లాలోని కంజియులర్ వద్ద భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా సిబ్బంది అనుమానాస్పద ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారని, ఆ తర్వాత ప్రతీకార చర్య తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

అలాగే.. మంగళవారం తెల్లవారుజామున శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పాకిస్థానీ సహా ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అమర్‌నాథ్ యాత్రపై దాడికి ప్లాన్ చేసిన బృందంలో హతమైన ఉగ్రవాదులు ఇద్దరూ ఉన్నారని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?