జార్ఖండ్లో దారుణం జరిగింది. పూరి గుడిసెలో ఇద్దరు బాలురు దారుణ హత్యకు గురైన సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది.
జార్ఖండ్లో దారుణం జరిగింది. పూరి గుడిసెలో ఇద్దరు బాలురు దారుణ హత్యకు గురైన సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, రాంచీకి సమీపంలోని చన్హా ప్రాంతానికి చెందిన మనీష్ ఓరన్(12), గణేష్ భగవత్(16)లు ఆదివారం ఓ పొలంలోకి వెళ్లే విషయమై కొంతమంది బాలురతో గొడపడ్డారు.
ఆ సాయంత్రమే గ్రామ శివారులోని పూరి గుడిసెలో శవాలై కనిపించారు. మనీష్ శవం గుడిసెకు వేళాతుండగా.. భగవత్ శవం నేలపై పడి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడి నేలపై ఓ కర్రను గుర్తించారు. ఆ కర్రతోటే ఇద్దర్నీ కొట్టి చంపినట్లు భావిస్తున్నారు.
ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిన్నారుల మృతిపై ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రాంచీ-పలాము జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనలు తెలియజేశారు.