వెజ్ బిర్యానీలో చికెన్.. మండిపడ్డ నెటిజన్, జొమాటో రియాక్షన్ ఇదే..!

Published : Jul 11, 2023, 01:25 PM IST
  వెజ్ బిర్యానీలో చికెన్.. మండిపడ్డ నెటిజన్, జొమాటో రియాక్షన్ ఇదే..!

సారాంశం

ఆన్‌లైన్‌లో  వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే, చికెన్ వచ్చిందట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. తన స్నేహితుడు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే,అందులో చికెన్ వచ్చిందట.

దేశంలో అత్యంత ఇష్టపడే వన్-పాట్ రైస్ డిష్‌లలో బిర్యానీ ఒకటి. సుగంధ ద్రవ్యాలు, మాంసం, అన్నం  ఈ రుచికరమైన కలయిక అద్భుతంగా ఉంటుంది. అందుకే బిర్యానీ ని చాలా మంది అమితంగా ఇష్టపడతారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో బిర్యానీ చాలా మంది ఆహార ప్రియులు అమితంగా ఇష్టపడతారు. ఛాన్స్ దొరికితే చాలు ఫుల్ గా లాగించేస్తూ ఉంటారు. 

చికెన్ నుండి మటన్ వరకు, కథల్ నుండి వెజిటేబుల్ వరకు  బిర్యానీకి చాలా వైవిధ్యాలు , వెర్షన్లు ఉన్నాయి. ఇటీవల, ఒక ట్విట్టర్ వినియోగదారురాలు తన స్నేహితుడు ఆన్‌లైన్‌లో  వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే, చికెన్ వచ్చిందట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకుంది. తన స్నేహితుడు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే,అందులో చికెన్ వచ్చిందట.

అశ్విని శ్రీవాస్తవ అనే ట్విట్టర్ యూజర్ ఆదివారం రాత్రి వారణాసిలో తన స్నేహితుడు అనుభవించిన కష్టాలను పంచుకున్నారు. అతను ఫుడ్ అగ్రిగేటర్ అప్లికేషన్ Zomato ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వెజిటబుల్ పనీర్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఇన్‌వాయిస్‌ను చూపించే రెండు వీడియోలను షేర్ చఏశారు.. 

 

 

తదుపరి క్లిప్‌లో స్నేహితుడు ఏమి అందుకున్నాడు - బిర్యానీ పెట్టెలో దాచిన చికెన్ ముక్కలు అని ఫోటోల రూపంలో చూపించాడు. మొదట ఆ చికెన్ చూసి పన్నీర్ అనే అనుకొని తినడం మొదలుపెట్టాడట. తర్వాత తెలిసింది అది పన్నీరు కాదు, చికెన్ అని. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశాడు. 

"వారు బెహ్రూజ్ బిర్యానీకి కాల్ చేసినప్పుడు, వారిని జొమాటోను సంప్రదించమని చెప్పారు,  వారు జొమాటోకు కాల్ చేసినప్పుడు, హోటల్‌తో మాట్లాడమని చెప్పారు" అని ఆమె  ఫిర్యాదు చేశారు. ఈ ట్వీట్ షేర్ చేసినప్పటి  నుండి 816.4k వీక్షణ,లు5.7k లైక్‌లు రావడం విశేషం.

ఇంతలో, జొమాటో, బెహ్రూజ్ బిర్యానీ రెండూ ఫిర్యాదును పరిశీలించాయి. ఈ వైరల్ ట్వీట్‌కు వెంటనే స్పందించాయి. "హాయ్ అశ్విని, జరిగిన దుర్ఘటనకు క్షమాపణలు. మేము అలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మేము దీన్ని వెంటనే తనిఖీ చేస్తాము" అని జొమాటో స్పందించడం విశేషం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu