Gujarat: గిరిజన సమాజం బీజేపీకి అండగా నిలుస్తుందని బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికలు జరగనున్న గుజరాత్ రాష్ట్రంలోని తాపీ జిల్లాలో ఆదివారం జరిగిన ప్రత్యేక ర్యాలీలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పై విమర్శల దాడిని కొనసాగించారు.
Amit Shah-Election Campaign: దేశంలోని గిరిజన సమాజం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అండగా నిలుస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. దక్షిణ గుజరాత్లోని గిరిజన ప్రాంతమైన దేడియాపాడలో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ "మా గిరిజన వర్గాల సాధికారత కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలుగా మోడీజీ చేసినంత కృషి చేయలేదు. అందుకే మన గిరిజన సోదరులు, సోదరీమణులు నేడు బీజేపీకి అండగా నిలుస్తున్నారు" అని అన్నారు.
వచ్చే నెలలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ తన ముందున్న అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం నాడు గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని తాపీ జిల్లాలో ఆదివారం జరిగిన ప్రత్యేక ర్యాలీలో కాంగ్రెస్ పై విమర్శల దాడిని కొనసాగించిన ఆయన.. ఆ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. గుజరాత్లో 1990 నుంచి బీజేపీ ప్రభుత్వం ఉందనీ, కాంగ్రెస్ చేసిన పని తనే మాట్లాడుతుందని కాంగ్రెస్ అంటోంది. ఏళ్ల తరబడి అధికారంలో లేని పార్టీకి ప్రగల్భాలు పలకాల్సిన పని లేదు.. సిగ్గుపడాలి.. గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని అమిత్ షా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు గిరిజన మహిళను దేశాధ్యక్షురాలిగా చేయడం ద్వారా గిరిజన వర్గాలను గౌరవించిందని అమిత్ షా అన్నారు. గిరిజనుల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఆయన అన్నారు. "కాంగ్రెస్ హయాంలో, గిరిజన సంక్షేమానికి ₹ 1,000 కోట్ల బుడెటరీ కేటాయింపు జరిగింది. అయితే, బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ₹ 1 లక్ష కోట్లకు పెంచింది. గుజరాత్లో కాంగ్రెస్కు మాట్లాడటానికి ఏమీ లేదు, అందుకే రాహుల్ బాబా రాష్ట్రంలో ప్రచారానికి రావడం లేదు.. బదులుగా ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నారు" అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించనందుకు కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకున్న షా, ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ను భారత యూనియన్తో విలీనం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించినప్పుడు.. కాంగ్రెస్ గోలగోల చేస్తూ.. రక్త నదులు ప్రవహిస్తాయని చెప్పింది. కానీ రక్త నదులను పక్కన పెడితే ఒక్క రాయి కూడా విసిరేందుకు ఎవరూ సాహసించలేదని షా అన్నారు.
పాకిస్థాన్కు లేదా మరే ఇతర దేశానికి తగిన సమాధానం ఎలా చెప్పాలో మోడీ ప్రభుత్వానికి తెలుసునని అమిత్ షా అన్నారు. "గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో, టామ్, డిక్, హ్యారీ ఎవరైనా పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి మన సైనికుల తలలు నరికి పారిపోయేవారు. మోడీజీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత కూడా పుల్వామా, ఉరీలలో ఉగ్రదాడులు జరిగాయి. అయితే, పాకిస్తాన్ ఏమి చేయలేదు. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదని తెలియదు. 10 రోజుల్లోనే మన బలగాలు పాకిస్థాన్లోకి ప్రవేశించి, వారి సొంత గడ్డపై ఉగ్రస్థావరాలపై దాడి చేశాయని" షా అన్నారు. కాగా, గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.