అమరావతిలో ఉద్రిక్తత... పోలీసులు,అటవీ అధికారులపై దాడి

Published : Jan 23, 2019, 03:36 PM IST
అమరావతిలో ఉద్రిక్తత... పోలీసులు,అటవీ అధికారులపై దాడి

సారాంశం

మహారాష్ట్రలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ రక్షణ కోసం సొంత ప్రాంతాలకు దూరం చేయడంతో పాటు తమకు సరైన పునరావాసం కల్పించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలపై కూడా  దాడిచేసి ధ్వంసం చేశారు.  ఈ ఘటన అమరావతి సమీపంలోని మేల్ ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది.   

మహారాష్ట్రలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ రక్షణ కోసం సొంత ప్రాంతాలకు దూరం చేయడంతో పాటు తమకు సరైన పునరావాసం కల్పించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలపై కూడా  దాడిచేసి ధ్వంసం చేశారు.  ఈ ఘటన అమరావతి సమీపంలోని మేల్ ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఎన్నో ఏళ్లుగా మేల్‌ఘాట్‌ అటవీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనులను అక్కడి నుండి ఖాళీ చేయించిన అటవీ అధికారులు అకోలాలో పునరావాసం ఏర్పాటుచేశారు. అయితే ఈ పునరావాస కేంద్రాల్లో అధికారులు తమకు కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో గిరిజనులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిరోజులయినా తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన అడవిబిడ్డలు అక్కడి నుండి వెళళిపోయేందుకు సిద్దమయ్యారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న అటవీ అధికారులు పోలీసుల సాయంతో వారిని నిలువరించే ప్రయత్రం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనుల మధ్య ఉద్రిక్తత చెలరేగి ఘర్షనకు దారితీసింది.  

ఈ ఆందోళనలో పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులపై కూడా గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలు, ఆపీసులపై కూడా దాడిచేసిన గిరిజనులు ఆస్తులను ధ్వంసం చేశారు.    


 

PREV
click me!

Recommended Stories

Kerala Elections: కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని మార్పు.. స‌ర్వేల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
వివాహేతర సంబంధం ఉంటే అరెస్ట్ చేస్తారా.? విజ‌య్ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంది? చ‌ట్టం ఏం చెబుతోందంటే