న్యూఇయర్ స్పెషల్...పెరిగిన రైలు ఛార్జీలు

Published : Jan 01, 2020, 11:00 AM IST
న్యూఇయర్ స్పెషల్...పెరిగిన రైలు ఛార్జీలు

సారాంశం

సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుందని వివరించాయి. అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదని తెలిపాయి. 

కొత్త సంవత్సరంలో రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలను పెంచింది. వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకి కనీసం 40 పైసలు పెంచుకుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

ఈ పెరిగిన రైలు ఛార్జీలు జనవరి 1వ తేదీ నుంచే అమలుకానున్నాయి. సాధారణ నాన్‌ ఏసీ రైళ్లకు ఈ చార్జీలు కిలోమీటరకు ఒక పైసా పెరగనుండగా.. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతాయి. ఇక అన్ని ఏసీ తరగతులకు కిలోమీటరుకు 4 పైసల చొప్పున పెరుగుతున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. 

సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుందని వివరించాయి. అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదని తెలిపాయి. 

దీంతోపాటు రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జీల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదని పేర్కొన్నాయి. కాగా రైల్వే చార్జీలను 2014-15లో సవరించారని, అనంతరం నిర్వహణ ఖర్చులు పెరిగాయని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు