విషాదం.. ఎలక్ట్రిక్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం..

Published : Aug 30, 2023, 11:31 AM IST
విషాదం.. ఎలక్ట్రిక్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం..

సారాంశం

ఎలక్ట్రిక్ షాప్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

మహారాష్ట్రలోని పూణెలో ఘోరం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. బుధవారం తెల్లవారుజామున పూణెలోని పింప్రి చించ్వాడ్ లోని చిఖలీ ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం ఉన్న నివాస భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనపై అగ్నిమాక విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పుణె జిల్లా పింప్రి-చించ్వాడ్ లోని పూర్ణానగర్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో నివాస భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రిక్ హార్డ్ వేర్ దుకాణంలో మంటలు చెలరేగాయి’’ అని పీసీఎంసీ (పింప్రి-చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్) ప్రకటనలో పేర్కొంది.

కాగా.. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతులను చిమ్నారామన్ చౌదరి, జ్ఞానదేవి చౌదరి, సచిన్ చౌదరి, భవేష్ చౌదరిగా అధికారులు గుర్తించారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక దళం బృందాలు అక్కడి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial