పట్టపగలు నడిరోడ్డుపై టీఎంసీ నేత హత్య.. రద్దీగా ఉండే మార్కెట్‌లో దుండగుల కాల్పులు..

Published : Apr 07, 2023, 02:43 PM IST
పట్టపగలు నడిరోడ్డుపై టీఎంసీ నేత హత్య.. రద్దీగా ఉండే మార్కెట్‌లో దుండగుల కాల్పులు..

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో పట్టపగలు TMC నాయకుడు హత్యకు గురయ్యాడు. నదియాలోని హన్స్‌ఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ బడా చౌపరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన తృణమూల్ నేతను అమోద్ అలీ బిశ్వాస్‌గా గుర్తించారు. 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. రక్తపాత ఘటనలు చోటుచేసుకుంటాయి. రాష్ట్రంలోని నదియా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. టీఎంసీ నేతను పట్టపగలు దుండగులు కాల్చిచంపారు. దీంతో ఆ నాయకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని హన్స్‌ఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ బడా చౌపరియా గ్రామంలో జరిగింది.  హత్యకు గురైన నాయకుడిని అమోద్ అలీ బిస్వాస్‌గా గుర్తించారు. టీఎంసీ నేతను బజారులో కాల్చి చంపారు. ఈ ఘటన తెరపైకి రావడంతో బీజేపీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

ఉద్రిక్త పరిస్థితులు

తృణమూల్ నాయకుడు అమోద్ అలీ బిశ్వాస్ ప్రతిరోజులాగానే నేడు కూడా మార్కెట్‌కు వెళ్లారు. టీ దుకాణంలో కూర్చుని ఉండగా.. కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులు జరిగిన దుండగులు ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్కులు వేసుకున్నారు. అదే సమయంలో ఈ సంఘటన తరువాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఈ సంఘటన రాజకీయ ప్రేరేపితమైందా లేదా ప్రతీకార పూరితమైందా అనేది చర్చనీయంగా మరింది.  

ఇంతకీ అమోద్ అలీ బిస్వాస్ ఎవరు?

అమోద్ అలీ బిస్వాస్ TMC నాయకుడు. ప్రస్తుతం రామ్‌నగర్ బడా చౌపాడియా నంబర్ 1 రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్య తర్వాత బీజేపీపై ఆరోపణలు చేస్తోంది.

విపక్షాల ప్రోద్బలంతో రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టిస్తున్నారని టీఎంసీ ఎంపీ శంతనుసేన్ అన్నారు. ఎవరినీ విడిచిపెట్టబోమన్నారు. నేరస్తులకు శిక్ష పడుతుంది. పంచాయతీ ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మొదలుపెట్టాయి. రాష్ట్రానికి కిరాయి హంతకులను తీసుకొస్తున్నారు. బెంగాల్‌ను అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్‌లో శాంతిని భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ప్రజానీకం తరిమికొడుతుందని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu