ఆటో బోల్తా.. బాలుడి మృతదేహాన్ని అండర్ పాస్ లో వదిలేసి వెళ్లిన స్నేహితులు, ముగ్గురు అరెస్ట్..

Published : Mar 14, 2023, 07:39 AM IST
ఆటో బోల్తా.. బాలుడి మృతదేహాన్ని అండర్ పాస్ లో వదిలేసి వెళ్లిన స్నేహితులు, ముగ్గురు అరెస్ట్..

సారాంశం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా, స్నేహితులు అతన్ని ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని అండర్‌పాస్ వద్ద పడేశారు.

న్యూఢిల్లీ : మానవీయ విలువలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. అపాయంలో ఉన్నవారు అపరిచితులైనా సరే కాపాడే కాలం నుంచి.. సొంత స్నేహితులు, కుటుంబసభ్యులైనా సరే నిర్థాక్షిణ్యంగా వదిలేసి వెళ్లడం... వారు ప్రాణాపాయంలో ఉన్నా చూసీ చూడనట్టు వెళ్లిపోవడం..లాంటి ఘటనలు భయాందోళనలు కలిగించే విషయాలే. ఇలాంటి ఘటనే న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ముగ్గురు స్నేహితులో తమతో పాటే వచ్చిన తమ స్నేహితుడు గాయాల పాలైతే.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అండర్ పాస్ లో పడేసి వెళ్లిపోయారు. దీంతో చికిత్స అందగా ఆ తరువాత అతను మృతి చెందాడు. 

ఈ ఘటన న్యూ ఢిల్లీలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. నలుగురు స్నేహితులు ఓ ఆటోలో వెడుతుండగా.. ఆటో బోల్తా పడింది. దీంతో అందులోని ఓ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, మిగతా ముగ్గురు స్నేహితులు తమ స్నేహితుడి మృతదేహాన్ని దేశ రాజధానిలోని వివేక్ విహార్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో పడేసినట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వారు ప్రయాణిస్తున్న ఆటో రిక్షా ప్రమాదానికి గురైంది, వారిలో ఒకరు గాయపడ్డారు.

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ల పేలుడు.. కాలిన గాయాలతో ఒకరి మృతి

"గాయపడిన అతను ఆ తరువాత మరణించాడు. అతనిని అతని ముగ్గురు స్నేహితులు అదే ఆటో-రిక్షాలో సంఘటన స్థలం నుండి తీసుకువెళ్లారు, అయినప్పటికీ, వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా, వివేక్ విహార్ ప్రాంతంలోని అండర్‌పాస్ వద్ద పడేసి వెళ్లారు" అని పోలీసులు తెలిపారు. అధికారి చెప్పారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఆటో రిక్షా ముగ్గురు నిందితులలో ఒకరిది. "వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. దీనిమీద విచారణ జరుగుతోంది" అని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. .

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu