20 మందిని దించాం, మోడీని చంపేస్తాం... ముంబై ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు మెయిల్‌

Siva Kodati |  
Published : Apr 01, 2022, 02:22 PM ISTUpdated : Apr 01, 2022, 02:26 PM IST
20 మందిని దించాం, మోడీని చంపేస్తాం... ముంబై ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు మెయిల్‌

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ఏకంగా ఎన్ఐఏ కార్యాలయానికి లేఖ రావడం కలకలం రేపుతోంది. మోడీని చంపేందుకు 20 కేజీల ఆర్డీఎక్స్, 20 మంది స్లీపర్ సెల్స్‌ని సిద్ధం చేశామని ఆగంతకులు పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ప్రధాని నరేంద్ర మోడీని (pm narendra modi) చంపేస్తామంటూ ముంబైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ (threatening email ) రావడం కలకలం రేపుతోంది. మోడీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేశామని.. ఆగంతకులు మెయిల్ చేశారు. ఇందుకోసం 20 కిలోల ఆర్డీఎక్స్ సిద్ధం చేశామని మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay