మరణించిన మహిళ సరస్వతి వైద్య మనోజ్ సాహ్ని (56) అనే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని నయా నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి తెలిపారు. దంపతులు గత మూడేళ్లుగా ఒకే ఫ్లాట్లో నివసిస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా-భయందర్ ప్రాంతంలోని భవనంలోని ఏడో అంతస్తులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికివేశారు. మృతి చెందిన మహిళను సరస్వతి వైద్యగా గుర్తించారు. మరణించిన మహిళ సరస్వతి వైద్య మనోజ్ సాహ్ని (56) అనే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని నయా నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి తెలిపారు. దంపతులు గత మూడేళ్లుగా ఫ్లాట్లో నివసిస్తున్నారు.
36 ఏళ్ల మహిళ మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికివేసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకోగా, కుళ్ళిపోయిన మహిళ మృతదేహం కనిపించిందని, అది అనేక ముక్కలుగా నరికివేయబడిందని అధికారి తెలిపారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుల గుర్తింపు లేదా హత్యకు గల కారణాలను అధికారి వెల్లడించలేదు.