పక్కలో పాస్ పోశాడని.. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ మీద వాతలు.. కన్నతండ్రి ఘాతుకం...

Published : Mar 01, 2021, 01:17 PM IST
పక్కలో పాస్ పోశాడని.. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ మీద వాతలు.. కన్నతండ్రి ఘాతుకం...

సారాంశం

పిల్లలు పక్క తడపడం మామూలే.. అయితే దాన్ని సాకుగా చూపించి ఓ చిన్నారిని కన్నతండ్రే చిత్రహింసలు పెట్టాడు. ఈ అమానుష ఘటన ముంబైలో వెలుగు చూసింది. 

పిల్లలు పక్క తడపడం మామూలే.. అయితే దాన్ని సాకుగా చూపించి ఓ చిన్నారిని కన్నతండ్రే చిత్రహింసలు పెట్టాడు. ఈ అమానుష ఘటన ముంబైలో వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెడితే.. థానేలోని వాగ్లేకర్ ఎస్టేట్స్ లో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి మొదటి భార్య కొడుకును చిత్రహింసలు పెట్టాడు. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి నిద్రలో పక్కలో పాస్ పోశాడని అతనిమీద అమానుషంగా వ్యవహరించాడు. 

రెండోభార్య, భర్త కలిసి చితకబాది పైశాచికానందం పొందారు. అంతేకాకుండా ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ పై వాతలు పెట్టారు. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన మీద మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం