జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపునకు వెళ్లేందుకు రెజర్ల యత్నం: అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

Published : May 28, 2023, 12:27 PM IST
జంతర్ మంతర్ నుండి  పార్లమెంట్ వైపునకు వెళ్లేందుకు  రెజర్ల యత్నం: అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

సారాంశం

జంతర్ మంతర్ వద్ద  రెజర్లు  ఆందోళనకు దిగారు.  రెజర్లు  పార్లమెంట్  భవనం వైపునకు వెళ్లేందుకు  ప్రయత్నించారు.  అయితే  పోలీసులు వారిని అడ్డుకున్నారు.  దీంతో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. 

న్యూఢిల్లీ:  దేశ రాజధాని  న్యూఢిల్లీలోని జంతర్ మంతర్  వద్ద  ఆదివారంనాడు  రెజర్ల  ఆందోళన  ఉద్రిక్తతకు దారితీసింది.   జంతర్ మంతర్ నుండి  కొత్త   పార్లమెంట్ భవనం వైపునకు  రెజర్లు  ప్రదర్శనగా వెళ్లే  ప్రయత్నం  చేశారు. రెజర్లను  పోలీసులు అడ్డుకున్నారు.  జంతర్ మంతర్ వద్ద  రోడ్డుకు అడ్డుగా పెట్టిన  బారికేడ్లను  రెజర్లు తోసివేశారు. ఈ సమయంలో   రెజర్లు,  పోలీసుల మధ్య  తోపులాట  చోటు  చేసుకుంది.  ఈ సమయంలో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. పలువురిని   పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. 

తమ డిమాండ్ల  సాధన  కోసం  35  రోజులుగా  రెజర్లు  ఆందోళనలు  నిర్వహిస్తున్నారు. రెజ్లింగ్  పెడరేషన్ ఆఫ్ ఇండియా అ్క్షుడు బ్రిజ్ భూషన్  పై  మహిళ  రెజర్లు  ఆరోపణలు  చేశారు.  ఈ విషయమై తమకు న్యాయం చేయాలని  తొలుత ఈ ఏడాది జనవరి మాసంలో   ఆందోళన  చేసిన విషయం తెలిసిందే.  మహిళ రెజర్లు  చేసిన  ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై  ఈ ఏడాది ఏప్రిల్  28న రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు  చేసిన విషయం తెలిసిందే .

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu