పదేళ్ల బాలికపై, మైనర్ల సామూహిక అత్యాచారం.. వీడియో తీసి..

Published : Jun 11, 2021, 03:51 PM IST
పదేళ్ల బాలికపై, మైనర్ల సామూహిక అత్యాచారం.. వీడియో తీసి..

సారాంశం

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. రేవారి అనే గ్రామంలో ఓ ఖాళీ పాఠశాల భవనంలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాలికను గ్రామంలోని ఖాళీ పాఠశాల భవనానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఈ నేరాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని పేర్కొన్నారు.

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. రేవారి అనే గ్రామంలో ఓ ఖాళీ పాఠశాల భవనంలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాలికను గ్రామంలోని ఖాళీ పాఠశాల భవనానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఈ నేరాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని పేర్కొన్నారు.

కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలిక కుటుంబం జూన్ 9న పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. ఇక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఐదుగురు మైనర్లు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐదవ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటి బయట ఆడుతుండగా నిందితులు ఆమెను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

LPG : వంట గ్యాస్ 14 కిలోలు కాకుండా 14.2 కిలోలే ఎందుకు ఉంటుందో తెలుసా?
Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు