న్యూ ఇయర్ వేళ విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Published : Jan 01, 2022, 11:33 AM IST
న్యూ ఇయర్ వేళ విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

సారాంశం

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. 

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. శివకాశి సమీపంలోని సమీపంలోని మెట్టుపట్టి గ్రామంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ