న్యూ ఇయర్ వేళ విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

By Sumanth KanukulaFirst Published Jan 1, 2022, 11:33 AM IST
Highlights

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. 

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. శివకాశి సమీపంలోని సమీపంలోని మెట్టుపట్టి గ్రామంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

click me!