న్యూ ఇయర్ వేళ విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Published : Jan 01, 2022, 11:33 AM IST
న్యూ ఇయర్ వేళ విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

సారాంశం

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. 

తమిళనాడులోని (Tamil Nadu) విరుద్‌నగర్ జిల్లా‌లో న్యూ ఇయర్ వేళ విషాదం చోటుచేసుకుంది. శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో (fireworks factory) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతించెందారు. శివకాశి సమీపంలోని సమీపంలోని మెట్టుపట్టి గ్రామంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?