తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే పెళ్లాడిన ప్రభుత్వాధికారి

By telugu teamFirst Published Oct 13, 2019, 6:30 PM IST
Highlights

ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

లక్నో: ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ సుబ డివిజనల్ మెజిస్ట్రేట్ గా విధులు నిర్వర్తిస్తున్న దినేష్ కుమార్ అనే వ్యక్తిపై ఓ మహిళ గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, పెళ్ళాడమంటే రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడని సదరు యువతి ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పెద్ద హోదాలో ఉన్న అధికారి శుక్రవారం సాయంత్రం సదరు యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఖుషి నగర్ లోని గాయత్రి మాత గుడిలో వీరిరువురి వివాహం అగ్నిసాక్షిగా జరిగింది. ఈ వివాహం జరిగినట్టు జిల్లా అధికారులు కూడా ధృవీకరించారు. 

click me!