కొడుకుతో కామవాంఛ తీర్చుకున్న తల్లి: చివరికిలా...

By telugu teamFirst Published Nov 16, 2020, 7:40 AM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. కన్న కుమారుడితో ఓ మహిళ లైంగిక వాంఛ తీర్చుకుంటూ వచ్చింది. ఇతరులతో కూడా లైంగిక సంబంధం పెట్టుకుంది.

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఆ కారణంగా ఓ ప్రాణం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కన్న కొడుకుతో ఓ మహిళ కామవాంఛ తీర్చుకోవడానికి సిద్ధపడింది. తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు తల్లితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. 

కొడుకుతోనే కాకుండా మరికొంత మందితో కూడా ఆ మహిళ లైంగిక సంబంధాలు పెట్టుకుంది. చివరకు తన కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటకలోని హవేరీ జిల్లాలో గల వనహల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల శివప్ప తండ్రి ఏడాది క్రితం మరణించాడు. అప్పటి నుంచి కన్నతల్లితోనే అక్రమం సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆమె కూడా కుమారుడి కోరికను తీర్చడానికి సిద్ధపడింది. 

శివప్పతోనే కాకుండా మరికొంత మందితో కూడా ఆమె తన కోరికను తీర్చుకుంటూ వచ్చింది. దీన్ని శివప్ప సహించలేకపోయాడు. ఎవరినీ కలవడానికి వీలు లేదని, తనతో మాత్రమే ఉండిపోవాలని తల్లిని హెచ్చరించాడు. అతని మాట తల్లి వినలేదు. దాంతో శివప్ప కోపంతో తల్లిని హత్య చేశాడు. 

హత్య, అత్యాచారం కింద కేసులు నమోదు పోలీసులు శివప్పను అరెస్టు చేశారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

click me!