కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఓ జవాను, నలుగురు టెర్రరిస్టులు మృతి

By pratap reddyFirst Published Nov 20, 2018, 9:00 AM IST
Highlights

జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మరణించాడు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీరులోని సోపియన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.
 

శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మరణించాడు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీరులోని సోపియన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.

రాష్ట్ర పోలీసులు, సిఆర్పీఎఫ్ జవాన్లు, సైనిక బలగాలకు చెందిన పారా ట్రూపర్స్ మంగళవారం ఉదయం నదిగామ్ అనే గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టరు. 

శ్రీనగర్ కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామంలో తొలుత ఉగ్రవాదులు ప్రభుత్వ బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా ప్రభుత్వ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.

click me!