కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఓ జవాను, నలుగురు టెర్రరిస్టులు మృతి

Published : Nov 20, 2018, 09:00 AM IST
కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఓ జవాను, నలుగురు టెర్రరిస్టులు మృతి

సారాంశం

జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మరణించాడు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీరులోని సోపియన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.  

శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మరణించాడు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీరులోని సోపియన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.

రాష్ట్ర పోలీసులు, సిఆర్పీఎఫ్ జవాన్లు, సైనిక బలగాలకు చెందిన పారా ట్రూపర్స్ మంగళవారం ఉదయం నదిగామ్ అనే గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టరు. 

శ్రీనగర్ కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామంలో తొలుత ఉగ్రవాదులు ప్రభుత్వ బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా ప్రభుత్వ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.

PREV
click me!

Recommended Stories

ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!