Sonia Gandhi: విద్వేషాన్ని పెంచుతున్న సోషల్ మీడియా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ పై సోనియా గాంధీ అసహనం..

Published : Mar 16, 2022, 04:29 PM ISTUpdated : Mar 16, 2022, 04:38 PM IST
Sonia Gandhi: విద్వేషాన్ని పెంచుతున్న సోషల్ మీడియా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ పై సోనియా గాంధీ అసహనం..

సారాంశం

Sonia Gandhi: సోషల్ మీడియాలు దేశంలో విద్వేషాన్ని పెంచుతున్నాయనీ, ఫేస్‌బుక్, ట్విట్టర్ ల పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ప‌నిచేస్తున్నాయ‌న్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Sonia Gandhi: ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ఇత‌ర సోష‌ల్ మీడియా వ్య‌వ‌స్థ‌లు చేస్తున్న రాజ‌కీయాల‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్  లు  దేశంలో విద్వేషాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేయడానికి సోషల్ మీడియా దుర్వినియోగం అయ్యే ప్రమాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. “ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం ఎన్నికల రాజకీయాల్లో ఫేస్‌బుక్ మరియు ఇతర సోషల్ మీడియా దిగ్గజాల క్రమబద్ధమైన జోక్యాన్ని అంతం చేయాలని” ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో  సోనియా గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. “రాజకీయ పార్టీల నాయకులు మరియు వారి ప్రాక్సీలచే రాజకీయ కథనాలను రూపొందించడానికి” ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలు ఉపయోగించబడుతున్నాయని అన్నారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు అన్ని రాజకీయ పార్టీలకు సమస్థాయిని కల్పించడం లేదని తెలిపారు. ఈ విషయం పదేపదే ప్రజల దృష్టికి వస్తున్న‌ద‌ని తెలిపారు. దేశంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలు ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ ల‌పై  అల్ జజీరా మరియు ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లో ప్రచురించబడిన ఒక నివేదికను సోనియా గాంధీ ప్రస్తావించారు, ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే ఎన్నికల ప్రకటనల కోసం "తమ స్వంత ద్వేషపూరిత ప్రసంగ నిబంధనలను వక్రీకరించడం ద్వారా" అధికార బీజేపీకి ఫేస్‌బుక్ చౌకైన ఒప్పందాలను అందించిందనీ, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడేవారి అందరి గొంతుక‌ల‌ను అణిచివేసిందని అన్నారు. 

నిబంధ‌న‌ల‌ను బ్రేక్ చేసి మ‌రీ మ‌త విద్వేషాల‌ను ఫేస్‌బుక్ రెచ్చ‌గొడుతున్నద‌ని సోనియా గాంధీ  ఆరోపించారు. ఫేస్‌బుక్ చేప‌డుతున్న అరాచ‌క రాజ‌కీయాల‌కు అంతం చేయాల‌ని డిమాండ్ చేశారు.  ఈ సమస్య అత్యంత ప్రాముఖ్యమైంద‌ని నొక్కిచెప్పిన సోనియా గాంధీ, "పాలక సంస్థ సహకారంతో ఫేస్‌బుక్ ద్వారా సామాజిక సామరస్యానికి భంగం కలిగించే కఠోరమైన విధానం మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. యువకులు మరియు ముసలి మనస్సులు ఒకే విధంగా భావోద్వేగపూరితమైన తప్పుడు సమాచారంతో, వారి ప్ర‌క‌ట‌న‌ల‌ద్వారా ద్వేషంతో నింపబడుతున్నాయి. ఫేస్‌బుక్ వంటి కంపెనీలు ఈ విషయాన్ని తెలుసుకుని కూడా ప‌ట్టించుకోకుండా లాభాలు పొందుతున్నాయి. ఈ నివేదికలు పెద్ద సంస్థలు, పాలక సంస్థ మరియు Facebook వంటి ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజాల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని చూపుతున్నాయి" అని సోనియా గాంధీ అన్నారు. “ఇది పక్షపాత రాజకీయాలకు అతీతం. ఎవరు అధికారంలో ఉన్నా మన ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలి అని సోనియా గాంధీ నొక్కి చెప్పారు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vande Mataram: వందేమాతరాన్ని అవమానిస్తే జైలు శిక్ష‌.. ఇక‌పై జాతీయ గీతంతో స‌మాన హోద
ఉత్తరాఖండ్ లో వరదలకి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ | Uttarakhand Flood Bridge Washed Away Viral Video