'అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి కూర్చోవ‌డం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం'

Published : Aug 29, 2022, 03:28 PM IST
'అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి కూర్చోవ‌డం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం'

సారాంశం

తరగతి గదుల్లో బాల‌బాలికలు కలిసి కూర్చోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని, అరాచకానికి దారితీస్తుందని  ఎస్‌ఎన్‌డిపి ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్  అన్నారు. కేరళ‌ ప్రభుత్వం అమలు చేస్తున్న‌ లింగ-తటస్థ విధానాన్ని  ఆయ‌న విమ‌ర్శించారు. 

తరగతి గదుల్లో బాల‌బాలికలు కలిసి కూర్చోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని, అరాచకానికి దారితీస్తుందని  ఎస్‌ఎన్‌డిపి ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్  అన్నారు. కేరళ‌ ప్రభుత్వం లింగ-తటస్థ విధానాన్ని అమ‌లు చేస్తుంది. ఈ విధానాన్ని వెల్లపల్లి నటేశన్ విమర్శించారు. అపరిపక్వ వయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి కూర్చోకూడదని, ఇది ప్రమాదకరమని హెచ్చ‌రించారు. అలా చేయ‌డం భారతీయ సంస్కృతి కాదనీ, హిందూ మతానికి చెందిన కళాశాలల్లో ఒక్కటి కూడా యూజీసీ జాబితాలో ర్యాంక్ సాధించలేదని, అక్కడ క్రమశిక్షణ లేదని వెల్లపల్లి అన్నారు. 

అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోకూడదు. మనది భారతీయ సంస్కృతి.. అమెరికా లాంటి ప్రాశ్చ‌త్య సంస్కృతిని మ‌న‌దేశంలో పాటించ‌డం సరికాద‌ని అన్నారు.  మ‌న దేశంలో క్రిస్టియన్, ముస్లిం మేనేజ్ మెంట్ కాలేజీలకు వెళ్తే.. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు కౌగిలించుకోవ‌డం. సృతి మించి ప్ర‌వ‌ర్తించ‌డం క‌నిపించని అన్నారు. కానీ, అయితే నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్), శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డిపి) నిర్వహిస్తున్న హిందూ విద్యాసంస్థల్లో ఇలాంటి అవాంఛ ఘ‌ట‌న‌లు జరుగుతున్నాయని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విద్యాసంస్థ‌ల్లో  అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఇదంతా తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుందని అర్థం చేసుకోవాలని అన్నారు. ఇటువంటి ప్రవర్తన అరాచకత్వానికి దారి తీస్తుంద‌నీ, హిందూ సంస్థలచే నిర్వహించబడుతున్న కళాశాలలలో, అటువంటి సంస్థలకు మంచి గ్రేడ్‌లు లేక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నుండి నిధులు రాకపోవడానికి ఇది ఒక కారణమని ఆయన అన్నారు. ఇంకా 18 ఏళ్లలోపు వారు లేదా కళాశాలల్లో యువకులు చదువుతున్నప్పుడు ఒకరినొకరు కలిసి కూర్చుని కౌగిలించుకోకూడదని ఆయన అన్నారు.
   
పిల్లలు పెద్దయ్యాక, పరిపక్వత వచ్చిన తర్వాత, వారు కోరుకున్నది చేయగలరని నటేసన్ చెప్పారు. అయితే.. పిల్లలు కలిసి కూర్చోవడం, ఒకరినొకరు కౌగిలించుకోవడం ప్రమాదకరమని ఆయన అన్నారు. తనను తాను లౌకిక ప్రభుత్వంగా చెప్పుకుంటున్నప్పటికీ, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మతపరమైన ఒత్తిడికి లొంగిపోవడం దురదృష్టకరమని, ఆలస్యమైనా కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం దురదృష్టకరమని నటేసన్ అన్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. లింగ తటస్థ విద్యా విధానానికి సంబంధించి వివిధ ముస్లిం సంస్థల నుండి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత పిల్లలు ఎలాంటి యూనిఫాం ధరించాలి లేదా వారు మిక్స్‌డ్ స్కూల్‌లో చేరాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించడం లేదని ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !