‘పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా..’ వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్...

By AN TeluguFirst Published Jul 23, 2021, 4:31 PM IST
Highlights

‘‘ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు.  దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇట్టే గ్రహించవచ్చు..’’ అంటూ పోస్ట్ చేశారు.

న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా శుక్రవారం ఆమె ఓ పోస్టు చేశారు..  పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా ఇచ్చారు.  ‘పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా..’ అంటూ పోస్ట్ చేసి అందర్నీ నవ్వించారు.  

 ‘‘ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు.  దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇట్టే గ్రహించవచ్చు..’’ అంటూ పోస్ట్ చేశారు.

దీంతోపాటు మరో పోస్టు కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ.. ’ఏ పదార్థము పర్ఫెక్ట్ గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి’ అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

click me!