జవాన్ల మధ్య వివాదం: తోటి జవాన్లపై కాల్పులు... ఆరుగురు ఐటీబీపీ సైనికులు మృతి

Siva Kodati |  
Published : Dec 04, 2019, 03:43 PM IST
జవాన్ల మధ్య వివాదం: తోటి జవాన్లపై కాల్పులు... ఆరుగురు ఐటీబీపీ సైనికులు మృతి

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌ ఐటీబీపీ క్యాంప్‌లో దారుణం జరిగింది. ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో అతనితో పాటు  ఐదుగురు సైనికులు మరణించారు

ఛత్తీస్‌గఢ్‌ ఐటీబీపీ క్యాంప్‌లో దారుణం జరిగింది. ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో అతనితో పాటు  ఐదుగురు సైనికులు మరణించారు. వివరాల్లోకి వెళితే... నారాయణపూర్ జిల్లా కేదార్‌నార్‌లోని 45వ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంపులో బుధవారం కొందరు జవాన్ల మధ్య వివాదం చోటు చేసుకుంది.

ఈ సమయంలో వారి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఆగ్రహానికి గురైన మసుదుల్ రెహమన్ తన సర్వీస్ రివాల్వర్‌తో సహచరులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెహమాన్‌తో సహా ఆరుగురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని హెలికాఫ్టర్‌లో రాయ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ మాట్లాడుతూ... జవాన్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఓ జవాన్ తోటి సహచరులపై కాల్పులు జరిపాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో రెహమాన్ తనను తాను కాల్చుకున్నాడా లేక అతని సహచరుల ఎదురుకాల్పుల్లో మరణించడా అనేది తెలియాల్సి వుంది.

ఇందుకోసం ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల రివాల్వర్లను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మరణించిన వారిని ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్స్ దుల్జీత్, ఎమ్ సింగ్, కానిస్టేబుల్స్ సుజిత్ సర్కార్, బిశ్వరూప్, బ్రిజేష్‌లుగా గుర్తించారు. గాయపడి వారిని ఎస్‌బీ ఉల్లాస్, సీతారామ్‌లు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families