సిద్ధూ మూసేవాలా మర్డర్ నిందితులు ఇద్దరు జైలులో హతం.. పంజాబ్ జైలులో ఫైట్

Published : Feb 26, 2023, 07:19 PM IST
సిద్ధూ మూసేవాలా మర్డర్ నిందితులు ఇద్దరు జైలులో హతం.. పంజాబ్ జైలులో ఫైట్

సారాంశం

పంజాబ్ సింగ్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు గూండాలు పంజాబ్‌లోని జైలులో జరిగిన గొడవలో మరణించారు. తార్న్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ఈ ముగ్గురూ ఒకే గ్రూపునకు చెందినవారని పోలీసులు తెలిపారు.  

న్యూఢిల్లీ: గతేడాది మే 29న పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగ్ సిద్దూ మూసేవాలాను పట్టపగలే దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. చుట్టుపక్కల నుంచి ఆ దుండగులు చుట్టుముట్టి కాల్పులు జరిపి కారులోనే సిద్దూను చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ మర్డర్ కేసులో బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు జైలులోనే హత్యకు గురవడం సంచలనంగా మారింది.

Also Read: మెడికో ప్రీతి కేసు .. నా బిడ్డ బతకదంటున్నారు : కన్నీటి పర్యంతమైన తండ్రి

పంజాబ్ తార్న్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఈ ముగ్గురూ ఒకే గ్రూప్‌నకు చెందినవారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో ఇద్దరు సిద్దూ మూసేవాలా మర్డర్ కేసుతో సంబంధం ఉన్నవారని వివరించారు. అయితే, వారిపై మరికొన్ని ఇతర కేసులూ ఉన్నట్టు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial