
సీఎల్పీ నేతగా సిద్ధరామయ్యను ఎన్నుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అనంతరం పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో కలిసి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు సంపూర్ణ మెజారిటీ వుందని, అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా మే 20న సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులను ఆహ్వానించారు సిద్ధరామయ్య.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఈ నెల 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. గత నాలుగు రోజులుగా సీఎం ఎంపిక విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యలు సీఎం రేసులో బలమైన పోటీదారులుగా ఉండటంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా తీవ్రంగానే శ్రమించింది.
డీకే శివకుమార్, సిద్దరామయ్యలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. తాము సీఎం పదవి కోరుకోవడనికి గల కారణాలను వారికి వివరించారు. ఈ క్రమంలోనే వారు కూడా ప్రతిష్టంభన పరిష్కారానికి గల మార్గాలను డీకే శివకుమార్, సిద్దరామయ్యల ముందు ఉంచారు. సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యను, ఉప ముఖ్యమంత్రిగా శివకుమార్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్.. చివరకు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడం వెనక పెద్ద తతంగమే జరిగింది.
సంస్థాగతంగా పార్టీ కోసం డీకే శివకుమార్ కష్టపడ్డారు. పార్టీ కష్ట సమయాల్లో ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు.. ట్రబుల్ షూటర్ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018ల ఎన్నికల తర్వాత ఏర్పడిన జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికే కూలిపోవడంతో.. గత నాలుగేళ్లుగా తాను పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డాననేది ఆయన అధిష్టానాకికి వివరించారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం పదవి కోసం పట్టుబట్టారు. అదే సమయంలో పార్టీ తనకు తల్లి లాంటిందని.. వెన్నుపోటు పోడవనని, బ్లాక్మెయిల్ చేయనని చెప్పుకొచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అంతా తానై నడిపించానని తెలిపారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకను అందించానని చెప్పారు. తాను జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ వచ్చి పరామర్శించారని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ALso Read: డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం పోస్టు.. ఒప్పించడంలో సోనియాదే ‘‘బిగ్’’ రోల్..!!
అయితే కర్ణాటక సీఎల్పీలో అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావించింది. సిద్ధరామయ్య మాస్ అప్పీల్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉండటం.. అంతేకాకుండా 2013 నుంచి 2018 వరకు సీఎంగా పనిచేసిన అనుభవం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన వైపే మొగ్గుచూపినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ ముందు పలు ఎంపికలను ఉంచినట్టుగా సమాచారం.
అయితే చివరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యంతో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించడానికి అంగీకరించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి పదవిపై బలమైన డిమాండ్తో ఉన్న శివకుమార్తో బుధవారం సాయంత్రం సోనియా గాంధీ మాట్లాడిన తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మే 20వ తేదీన బెంగళూరులో కర్ణాటక నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.