బీజేపీ సగం సీట్లు ఇస్తే సరి.. లేదంటే విడిపోవడమే: శివసేన ఎంపీ సంజయ్

Siva Kodati |  
Published : Sep 19, 2019, 02:56 PM IST
బీజేపీ సగం సీట్లు ఇస్తే సరి.. లేదంటే విడిపోవడమే: శివసేన ఎంపీ సంజయ్

సారాంశం

పొత్తులో భాగంగా తమకు సగం స్థానాలను ఇవ్వడంలో బీజేపీ విఫలమైతే కూటమి నుంచి వైదొలగుతామని స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాల సమక్షంలో కుదిరిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ గౌరవించాలని సంజయ్ కోరారు. 

త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మధ్య అప్పుుడే పొత్తు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ అధినాయకత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు.

పొత్తులో భాగంగా తమకు సగం స్థానాలను ఇవ్వడంలో బీజేపీ విఫలమైతే కూటమి నుంచి వైదొలగుతామని స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాల సమక్షంలో కుదిరిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ గౌరవించాలని సంజయ్ కోరారు.

మరోవైపు శివసేనకు 124 స్థానాలకు మించి ఇవ్వలేమని బీజేపీ చెబుతోందనే వార్తలతో సేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే ఒంటరిపోరుకు సిద్ధం కావాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పార్టీ శ్రేణులను కోరినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు