నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్.. ఎన్‌సీబీ తనిఖీలు ఫేక్.. అధికార పార్టీ నేత

By telugu teamFirst Published Oct 7, 2021, 5:31 PM IST
Highlights

షారూఖ్ ఖాన్ తనయుడు అరెస్టయిన ఎన్‌సీబీ తనిఖీల కేసుపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తనిఖీలు నకలీవని, అందులో ఎన్‌సీబీకి చెందనివారూ ఉన్నారని, ఓ బీజేపీ నేత, ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఉన్నారని తెలిపారు. నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖాన్ అని ఆరోపించారు.
 

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న ఓ క్రూయిజ్ షిప్‌లో NCB అధికారులు సోదాలు, అందులో బాలీవుడ్ స్టార్ shahrukh khan తనయుడు aryan khanపట్టుబడటంపై అధికార పార్టీ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తనిఖీలు అన్నీ ఫేక్ అని అన్నారు. నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖానే అని ప్రకటించారు. ఎన్‌సీబీ తనిఖీల్లో బయటి వారి ప్రమేయమూ ఉన్నదని అన్నారు.

ఈ నెల 2న జరిగిన ఎన్‌సీబీ తనిఖీలు అన్నీ నకిలీవని ncp నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఆ దాడిలో అసలు మాదక ద్రవ్యాలే లభించలేవని తెలిపారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు ఒక ఫోర్జరీ అని ఆరోపించారు. గత నెల రోజులుగా నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖాన్ అని క్రైం రిపోర్టర్లకు సమాచారాన్ని పంచుకుంటూ వస్తున్నారని తెలిపారు. అంతేకాదు, ఎన్సీబీ తనిఖీల్లో ఓ బీజేపీ నేత ఉన్నారని ఆరోపించారు. మరో ప్రైవేటు డిటెక్టివ్ కూడా ఉన్నారని వివరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన పేర్కొన్న వీడియోలో బీజేపీ నేత భానుశాలి, ప్రైవేటు డిటెక్టివ్ గోసావి ఉన్నారు.

 

Here’s the video of Kiran P Gosavi and Manish Bhanushali entering the NCB office the same night the cruise ship was raided. pic.twitter.com/25yl9YsrSJ

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp)

కాగా, నవాబ్ మాలిక్ ఆరోపణలను ఎన్‌సీబీ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారాలని ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ గ్యానేశ్వర్ సింగ్ తెలిపారు. ఇది వరకే మొదలైన కొన్ని కేసుల దర్యాప్తుపై బురదజల్లడానికే ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

click me!