ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తులపై దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురి మృతి.. పలువురికి గాయాలు.. 

Published : Nov 01, 2022, 12:39 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తులపై దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురి మృతి.. పలువురికి గాయాలు.. 

సారాంశం

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.కొంతమందికి గాయాలయ్యాయి.  సంగోలా టౌన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.కొంతమందికి గాయాలయ్యాయి.నివేదికల ప్రకారం.. సాయంత్రం 6.45 గంటలకు సంగోలా టౌన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇక్కడ 32 మంది యాత్రికుల బృందం, (వర్కరి అని పిలుస్తారు) మతపరమైన తీర్థయాత్ర (డిండి) కోసం సమావేశమయ్యారు.

ఈ ప్రయాణం కొల్హాపూర్ జిల్లాలోని జాతర్‌వాడి నుంచి పండర్‌పూర్‌కు చేరుకుంది. ఈ ప్రమాదానికి గురైన బృందం మూడు రోజుల క్రితమే వెళ్లిపోయింది. ఇంతలో ఆదివారం సాయంత్రం వేగంగా వచ్చిన ఎస్‌యూవీ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. కారుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో 15 మంది యాత్రికులు గాయపడ్డారు.  

సీఎం షిండే పరిహారం 

షోలాపూర్ రోడ్డు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. దీంతో పాటు మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు. క్షతగాత్రులకు తక్షణమే , సరైన చికిత్స అందించాలని పరిపాలనను ఆదేశించారు. వార్కారీ సోదరులారా" అని షిండే మరాఠీలో ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?