బీజేపీ నేతపై సంజయ్ రౌత్ పరువునష్టం దావా ! అసలేం జరిగింది ?

Published : Jun 13, 2023, 06:29 AM IST
బీజేపీ నేతపై సంజయ్ రౌత్ పరువునష్టం దావా ! అసలేం జరిగింది ?

సారాంశం

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు కిరీట్ సోమయ్యపై పరువు నష్టం కేసు దాఖలు చేయడం ద్వారా శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ ములుండ్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. సోమయ్య తనపై సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా అనేక ఆరోపణలు చేశారని, వివిధ మోసాలకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు.

బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య తన అవమానకరమైన ట్వీట్‌ చేశాడంటూ శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో తన న్యాయవాది సుదీప్ సింగ్ ద్వారా ఫిర్యాదు దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు సోమయ్యపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 (పరువునష్టం కోసం శిక్ష) కింద శిక్షార్హమైన నేరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. సోమయ్య తనపై సోషల్ మీడియా పోస్టుల ద్వారా పలు ఆరోపణలు చేశారని, తనపై పలు మోసాలకు పాల్పడ్డారని రౌత్ పేర్కొన్నారు. 

సంజయ్ రౌత్ ప్రకారం.. 2022 నుండి నిందితుడు తన ప్రతిష్టను దిగజార్చేలా కొన్ని అసత్య ఆరోపణలు సంబంధించిన ట్వీట్లు చేయడం తాను గమనించాననీ, అవి పూర్తిగా అసంబద్ధమైన ప్రకటనలు అని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ ప్రకటనలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని రౌత్ అన్నారు. దీనిపై రానున్న రోజుల్లో కోర్టు విచారణ జరుపుతుందని భావిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కిరీట్ సోమయ్యకు లీగల్ నోటీసు పంపడం ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈడీ నమోదు చేసిన కేసులో సంజయ్ రౌత్ జైలులో ఉన్నప్పుడు కిరీట్ సోమయ్య కొన్ని ట్వీట్లు చేశాడు. తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసినందుకు సోమయ్య బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో కోరారు. సోమయ్య అలా చేయకుంటే అతనిపై పరువు నష్టం కేసు పెడతానని రౌత్ హెచ్చరించారు.

సంజయ్ రౌత్ లాయర్ ట్వీట్లను ప్రస్తావిస్తూ.. బిజెపి  నాయకుడు కిరీట్ సోమయ్య  తన క్లయింట్‌పై చాలా తప్పుడు , నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. మీ ట్విట్టర్ ఖాతాలోని ప్రతి ఆరోపణ పూర్తిగా అబద్ధం, కల్పితం, ఎలాంటి సాక్ష్యం లేనిదని అన్నారు. ఈ ట్వీట్లు అవమానకరమైనవి, రౌత్ విశ్వసనీయతను, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. 


బీజేపీకి చెందిన కిరీట్ సోమయ్య అలియాస్ పోపట్లాల్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, శివసేన నేతలపై బురద జల్లుతున్నాడని  సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. తాను చట్టపరమైన చర్య ప్రారంభించాననీ, మిస్టర్ పోపట్‌లాల్‌కి లీగల్ నోటీసు పంపాననీ, త్వరలో నిజం గెలుస్తుందని  సంజయ్ రౌత్ అన్నారు. 

పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను గతేడాది ఆగస్టులో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, రౌత్ మాత్రం తాను నిర్దోషినని, ఇరికించబడుతున్నట్లు పేర్కొంది. రౌత్‌కు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు నవంబర్ 9న బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి, సంజయ్ రౌత్‌పై కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య పరువు నష్టం కేసు వేశారు. రౌత్ ఆరోపణలు అబద్ధమని పేర్కొన్నారు. ఈ పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్‌పై వారెంట్ జారీ అయింది. ఆ తర్వాత కిరీట్ సోమయ్య, రౌత్ మధ్య వివాదం పెరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu