తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు మహళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.