ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదాని వెంట ఒకటి ఢీ కొన్న వాహనాలు.. ఐదుగురు మృతి..

By AN TeluguFirst Published Feb 16, 2021, 9:16 AM IST
Highlights

మహారాష్ట్రలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

మహారాష్ట్రలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే మీద ఖోపోలికి సమీపంలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు ఒక్కసారిగా ఒకదాని వెంట మరొకటి వేగంగా వెల్తూ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృత్యవాత పడ్డారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!