Republic Day Parade 2022: ఉత్త‌మ శ‌క‌టాలు, ప్ర‌ద‌ర్శ‌నలివే...

Published : Feb 04, 2022, 05:09 PM IST
Republic Day Parade 2022: ఉత్త‌మ శ‌క‌టాలు, ప్ర‌ద‌ర్శ‌నలివే...

సారాంశం

Republic Day Parade 2022: రిపబ్లిక్ డే పరేడ్ 2022 లో  ప్ర‌ద‌ర్శించిన ఉత్తమ శ‌క‌టాలు, ఉత్తమ కవాతు ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ ఫ‌లితాలను మూడు న్యాయమూర్తుల ప్యానెల్ విడుద‌ల చేసింది. ఉత్త‌మ శ‌క‌టంగా.. ఉత్త‌రప్ర‌దేశ్ చెందిన  కాశీ విశ్వనాథ్ కారిడార్ శ‌క‌టం ఎంపిక కాగా.. ఉత్త‌మ క‌వాతు చేసిన బృందంగా   CAPF/ఇతర సహాయక దళాలకు చెందిన‌ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉత్తమ కవాతు బృందంగా ఎంపికైంది.  

Republic Day Parade 2022: 73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. ఈ పరేడ్ లో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఎంత‌గానో ఆకట్టుకుంది. అయితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చెందిన శకటం ఉత్త‌మ శ‌క‌టం అవార్డును గెలుచుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.  ఈ శ‌క‌టంలో ఇటీవల మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ తో ఉత్తరప్రదేశ్ శకటం ఆకట్టుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాశీ విశ్వనాథుని ఆలయ సౌందర్యాన్ని, సాంస్కృతిక సౌరభాన్ని వివరించేలా ఈ శకటాన్ని తయారుచేశారు. అలాగే ఈ శకటంపై స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.  

‘క్రెడిల్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్’ ఆధారంగా రూపొందించిన క‌ర్ణాట‌క శ‌క‌టం రెండో స్థానంలో నిలిచింది. మేఘాలయ చెందిన శ‌క‌టం మూడవ స్థానం లో నిలించింది. ఈ రాష్ట్రం అవ‌త‌రించి.. 50 సంవత్సరాల పూర్తి, మహిళల నేతృత్వంలోని సహకార సంఘాలు & SHGలకు పాత్ర ' అనే అంశంపై మేఘాలయ శ‌క‌టాన్ని రూపొందించింది. 

 
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం 12 రాష్ట్రాలు, 9 ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలు ఈ సంవత్సరం పరేడ్‌లో పాల్గొన్నాయని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. రిపబ్లిక్ డే పరేడ్ 2022 లో  ప్ర‌ద‌ర్శించిన ఉత్తమ శ‌క‌టాలు, ఉత్తమ కవాతు ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ ఫ‌లితాలను మూడు న్యాయమూర్తుల ప్యానెల్ విడుద‌ల చేసింది


కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల విభాగంలో విద్యా మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ & మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క శ‌క‌టాలు ఆ త‌రువాత స్థానంలో ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ అఫైర్స్ (CPWD) యొక్క శ‌క‌టం, ‘సుభాష్ @125’ థీమ్ ఆధారంగా ‘వందే భారతం’ డ్యాన్స్ గ్రూప్ కు ప్రత్యేక బహుమతి ల‌భించింది. 
 

పాపులర్ ఛాయిస్ అవార్డులు

మొదటిసారిగా, MyGov ప్లాట్‌ఫారమ్ ద్వారా పాపులర్ చాయిస్ కేటగిరీలో ఉత్తమ కవాతు కాంటింజెంట్‌లు, ఉత్తమ టేబుల్‌యాక్స్ కోసం ఓటు వేయమని సాధారణ ప్రజలను ఆహ్వానించారు. ఆన్‌లైన్ పోల్ జనవరి 25-31, 2022 మధ్య నిర్వహించబడింది. ఈ ఓటింగ్ లో అత్య‌ధిక జనాదరణ ప్ర‌ద‌ర్శ‌న‌గా భారత వైమానిక దళానికి చెందిన కవాతు బృందం మూడు సర్వీసులలో అత్యుత్తమ కవాతు బృందంగా ఎంపిక చేయబడింది. అలాగే..సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉత్తమ కవాతు బృందంగా MyGovలో గరిష్ట ఓట్లను పొందింది.

 పాపులర్ చాయిస్ కేటగిరీలో రాష్ట్రాలు/UTలలో మహారాష్ట్ర చెందిన‌ ఉత్తమ శ‌క‌టంగా ఎంపిక చేయబడింది. మహారాష్ట్ర యొక్క శ‌క‌టం 'జీవవైవిధ్యం,మహారాష్ట్ర యొక్క రాష్ట్ర జీవ-చిహ్నాలు' అనే థీమ్‌పై రూపొందించారు. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ శ‌క‌టం, మూడో స్థానంలో జమ్మూ, కాశ్మీర్ శ‌క‌టం నిలిచింది.

ప్రజల ఎంపిక ఆధారంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్/డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యునికేషన్ యొక్క శ‌క‌టం.. ఉత్తమ పట్టికగా ఎంపికైంది. ఈ శ‌క‌టాన్ని'ఇండియా పోస్ట్: 75 సంవత్సరాలు- మహిళా సాధికారత అనే థిమ్ మీద రూపొందించారు.

ఉత్తర్‌ప్రదేశ్ శకటం విశేషాలు..

- ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శకటంపై స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.
- ప్రపంచ ప్రఖ్యాతమైన కాశీ విశ్వనాథ్ ధామ్ నమూనాను కూడా ఈ శకటంలో భాగం చేశారు.
- శకటం ముందు భాగంలో సంప్రదాయ వస్తువులు, శిల్పాల తయారీ, హస్తకళల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు సాధించిన ప్రగతికి దర్పణం పట్టేలా నమూనాలను తీర్చిదిద్దారు.
- శకటం మధ్య భాగంలో సాధువులు, మునులు.. వారణాసిలోని వివిధ ఘాట్‌లలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నట్లు చూపించారు. ఇది మన సంప్రదాయంలో భాగమనే విషయాన్ని తెలియజేశారు.
కాశీ విశ్వనాథుని ఆలయం సహా నగర ప్రాసస్త్యాన్ని తెలియజేసేలా రూపకల్పన చేశారు.

శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌

33 నెలల్లో 700 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను డిసెంబర్ 13న దేశానికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ధామ్‌లో బాలేశ్వర్, మక్రానా, కోట, గ్రానైట్, చునార్, మడోన్నా స్టోన్, మార్బుల్ ఏడు రకాల రాళ్లను ఉపయోగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 8 మార్చి 2019న కాశీ విశ్వనాథ్ ధామ్‌కు శంకుస్థాపన చేశారు. ధామ్ కోసం భూమిని కొనుగోలు చేయడానికి సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పటివరకు నిర్మాణ పనులకు దాదాపు రూ.339 కోట్లు ఖర్చు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Union Budget : బంగారం ధరలు తగ్గుతాయా? నిర్మలా సీతారామన్ ప్లాన్ ఇదేనా?
Will Gold Prices Fall or Rise? Baba Vanga’s 2026 Economic Warning Resurfaces | Asianet News Telugu