Bilkis Bano case: బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన 11 మందిని విడుదల చేయడంతో బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఏం సందేశం ఇస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Rahul Gandhi: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హత్యా కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన 11 మందిని ఇటీవల గుజరాత్ లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం విడుదల చేసింది. రేపిస్టులకు, హత్యా నేరాలకు పాల్పడిన దోషులను గుజరాత్ సర్కారు విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక గర్బిణీని పై గ్యాంగ్ రేప్ చేసి.. ఆ కుటుంబంలోని ఏడుగురిని నరికి చంపిన దోషులను విడుదల చేసి.. బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఏం సందేశం ఇస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
పాత రిమిషన్ పాలసీ ప్రకారం గ్యాంగ్రేప్, హత్య దోషులను విడుదల చేయడానికి అనుమతించినందుకు గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ నాయకుడు తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'నారీ శక్తి' లేదా మహిళా శక్తి గురించి మాట్లాడిన కొన్ని గంటల తర్వాత దోషులు విడుదలైనప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు చేతలకు మధ్య ఉన్న తేడాను యావత్ భారతావని చూస్తోందని అన్నారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా 5 నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, ఆమె 3 ఏళ్ల కుమార్తెను చంపిన వారిని విడుదల చేశారు' అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
5 महीने की गर्भवती महिला से बलात्कार और उनकी 3 साल की बच्ची की हत्या करने वालों को 'आज़ादी के अमृत महोत्सव' के दौरान रिहा किया गया।
नारी शक्ति की झूठी बातें करने वाले देश की महिलाओं को क्या संदेश दे रहे हैं?
प्रधानमंत्री जी, पूरा देश आपकी कथनी और करनी में अंतर देख रहा है।
"మహిళా సాధికారత గురించి మాట్లాడే వారి నుంచి దేశంలోని మహిళలకు ఏం సందేశం వెళుతోంది’ అని ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ, "నారీ శక్తి" గురించి మాట్లాడుతూ, "మహిళల గౌరవాన్ని తగ్గించే పని చేయకూడదు" అని అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే ఇతర కాంగ్రెస్ ఎంపీలు, అధికార ప్రతినిధులు కూడా అదే వాదనను ఉపయోగించి ప్రధానిపై విమర్శల దాడి చేశారు. కాగా, గుజరాత్ ప్రభుత్వం 11 మంది వ్యక్తులను విడుదల చేయాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1992 విధానం ప్రకారం, సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రకారం 2008లో నేరారోపణ సమయంలో అది అమలులో ఉన్నందున విడుదల అభ్యర్థనను పరిగణించామని పేర్కొంది.
ఇదిలావుండగా, బుధవారం నాడు తెలంగాణ మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్) ఆగస్టు 15 నాటి తన ప్రసంగంలో "మహిళలను గౌరవించడం" గురించి ఏమి చెప్పారో "నిజంగా అర్థం చేసుకున్నారా" అని ప్రధానిని ప్రశ్నించారు. అదే ఆయన ఉద్దేశ్యమైతే.. జోక్యం చేసుకుని గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ ఆర్డర్ను రద్దు చేయాలని కోరుతున్నాను’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Dear PM Ji,
If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏
Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation