ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై

Siva Kodati |  
Published : Sep 13, 2023, 06:25 PM ISTUpdated : Sep 13, 2023, 06:34 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై

సారాంశం

 ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారాడు. లిక్కర్ స్కాంలోని ఈడీ కేసులో ఆయన అప్రూవర్‌గా మారినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈ కేసులో రామచంద్రపిళ్లై ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. అంతేకాదు.. ఈడీ, సీబీఐ కేసులోనూ ఆయన నిందితుడిగా వున్నాడు. 

ALso Read: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అఫ్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఇదే స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారడంతో ఆయన నుంచి ఈడీ కీలక విషయాలు రాబట్టినట్లుగా సమాచారం. అయితే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువమంది సౌత్ గ్రూప్‌నకు చెందినవారే కావడం గమనార్హం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు