ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు: రాజ్యసభలో ఆమోదం

Published : Aug 07, 2023, 10:16 PM ISTUpdated : Aug 07, 2023, 10:45 PM IST
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు: రాజ్యసభలో ఆమోదం

సారాంశం

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు  రాజ్యసభ  సోమవారంనాడు రాత్రి  ఆమోదం తెలిపింది.  ఈ బిల్లుకు  అనుకూలంగా  131 ఓట్లు వచ్చాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు  సోమవారంనాడు  రాత్రి  రాజ్యసభ ఆమోదం తెలిపింది.  బిల్లుకు అనుకూలంగా  131 ఓట్లు వచ్చాయి.  బిల్లుకు వ్యతిరేకంగా  102 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం  పంపనుంది కేంద్రం.నేషనల్ కేపిటల్ టెరిటర్ ఆఫ్ ఢిల్లీ(సవరణ) 2023 బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టారు.  ఈ బిల్లుపై ఇవాళ మధ్యాహ్నం చర్చను కాంగ్రెస్ సభ్యులు అభిషేక్ సింఘ్వి ప్రారంభించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా  ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

 ఈ బిల్లును వ్యతిరేకించే  పార్టీలు బలం 102కు మాత్రమే పరిమితమైంది.  ఈ బిల్లుకు మద్దతు తెలిపే వారి సంఖ్య 131కి చేరింది. దీంతో ఈ బిల్లు పాస్ అయిందని  రాజ్యసభ వైఎస్ చైర్మెన్  ఇవాళ సభలో ప్రకటించారు.  ఈ నెల  3వ తేదీన  ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.    ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆప్ వ్యతిరేకిస్తుంది.ఈ ఆర్డినెన్స్ ను నిరసిస్తూ విపక్షాలను  కూడగట్టింది. ఈ విషయమై  సుప్రీంకోర్టును కూడ  ఆప్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఈ నెల 1న లోక్ సభలో  కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టిన రెండు రోజులకే లోక్ సభలో ఆమోదం పొందింది. విపక్ష సభ్యులు ఈ బిల్లును నిరసిస్తూ  లోక్ సభ నుండి వాకౌట్  చేశారు.  ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లును  అమిత్ షా ప్రవేశ పెట్టారు. ఇవాళ రాత్రి ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.  ప్రాంతీయ పార్టీలు కొన్ని  ఈ బిల్లుకు మద్దతును తెలిపాయి. 

 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu