స్నానం చేస్తుండగా కన్నతల్లిని నగ్నంగా ఫోటోలు తీసి..

Published : May 19, 2020, 07:42 AM ISTUpdated : May 19, 2020, 09:09 AM IST
స్నానం చేస్తుండగా కన్నతల్లిని నగ్నంగా ఫోటోలు తీసి..

సారాంశం

ఇల్లు తన పేర రాయలేదనే అక్కసుతో తల్లి స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

రాను రాను సమాజంలో మానవ సంబంధాలకు విలువ అనేది లేకుండాపోతోంది. మనుషులు, వారి బంధాలు, అనుబంధాలపై చూపించాల్సిన ప్రేమంతా ఆస్తులు, డబ్బు సంపాదనపై పెట్టేస్తున్నారు. కన్న తల్లి, కడుపున పుట్టిన బిడ్డ అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఆసక్తి కన్న తల్లిపైనే అకృత్యానికి పాల్పడ్డాడు.

 ఇల్లు తన పేర రాయలేదనే అక్కసుతో తల్లి స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీపక్‌ తివారి (50)అనే వ్యక్తి శివపురి ప్రాంతంలో ఉన్న తమ ఇంటిని తన పేరున రాయమంటూ కొంతకాలంగా తల్లి (75)ని వేధిస్తున్నాడు. అయితే.. ఆమె తన తదనంతరమే ఆ ఇంటిని బిడ్డలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కొడుకు అడిగినా ఇల్లు రాసివ్వలేదు.

దీంతో కన్నతల్లిపై అక్కసు పెంచుకున్నాడు. ఇటీవల మరణించిన తన తండ్రి దశదిన కర్మక్రియలు నిర్వహించే క్రమంలో తల్లిపై ఓ రసాయనాన్ని స్ర్పే చేశాడు. దీంతో ఆమె ఒళ్లంతా దురదలు రావడంతో.. స్నానం చేసేందుకు బాత్‌రూంలోకి వెళ్లింది. 

ఆ సమయంలో అతడు రహస్యంగా ఆమెను ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను బంధువులకు వాట్సా్‌పలో పోస్టు చేశాడు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె.. అవాక్కయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !