భారత్ బంద్ : పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ తగ్గించిన వసుంధరా రాజే

Published : Sep 10, 2018, 12:20 PM ISTUpdated : Sep 19, 2018, 09:17 AM IST
భారత్ బంద్ : పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ తగ్గించిన వసుంధరా రాజే

సారాంశం

రోజు రోజుకు చుక్కల్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

రోజు రోజుకు చుక్కల్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది..

అయితే బంద్ రోజున కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగింది. లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. ఇదిలా ఉండగా... బంద్ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 4 శాతం తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆ రాష్టరంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.

PREV
click me!

Recommended Stories

Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu