మండుతున్న ఎండలు.. కరిగిపోతున్న ట్రైన్ పట్టాలు, యూపీలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Published : Jun 18, 2023, 03:02 PM IST
మండుతున్న ఎండలు.. కరిగిపోతున్న ట్రైన్ పట్టాలు, యూపీలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

సారాంశం

యూపీలో లక్నోలోని ఓ రైల్వే స్టేషన్‌లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నిగోహన్ రైల్వే స్టేషన్‌లోని లూప్ లైన్ పట్టాలు తీవ్ర ఎండలంతో మెత్తబడ్డాయి. దాని మీదుగా ట్రైన్ వెళ్లడంతో కరిగిపోయి మందంగా మారిపోయాయి. లోకో పైలట్ ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ట్రైన్ నిలిపేశాడు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. నిగోహన్ రైల్వే స్టేషన్‌లో లూప్ లైన్‌లోని రైల్వే ట్రాక్స్ మండుతున్న ఎండలకు కరిపోతున్నది. శనివారం నాటి తీవ్రమైన ఎండలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ట్రాక్స్ మీదుగా వెళ్లుతున్న రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.

నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్‌లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్‌లోకి వెళ్లింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్‌లోకి వెళ్లగా.. అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలైంది. ఫలితంగా ఆ పట్టాలు వెడల్పుగా మారాయి.

రైల్వే ట్రాక్ వెడల్పుగా మారుతుండటంతో రైలు చక్రాలతో ఘర్షణ ఏర్పడ్డది. ఆ నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపేశాడు. వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేశాడు. ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు వెంటనే సమస్యను గుర్తించారు. ఆ ట్రాక్ రిపేర్ చేయడాన్ని ప్రారంభించారు.

Also Read: యూపీలో వడగాలుల బీభత్సం.. మూడు రోజుల్లో 54 మంది మృతి, 400 మంది ఆస్పత్రికి..

లక్నో జంక్షన్ చేరుకున్న తర్వాత లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని అందించాడు. రైల్వే డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు డ్యామేజీ అయిన ట్రాక్స్‌ను పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

ఈ లూప్ లైన్‌ను వినియోగించకుండా స్టేషన్ మాస్టర్‌ను అలర్ట్ చేశారు.

ట్రాక్‌లను సరిగ్గా మెయింటెయిన్ చేయని కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేశ్ సప్రా తెలిపారు. నిగోహన్ రైల్వే స్టేషన్‌లో వేరే ట్రైన్‌లు ఆగి ఉండటం వల్ల నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి వెళ్లిందని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం