గిరిజనుల భూములు అదానీకి అప్పగిస్తుంది: రాజస్థాన్‌లో బీజేపీపై రాహుల్ ఫైర్

Published : Aug 09, 2023, 05:50 PM IST
గిరిజనుల భూములు అదానీకి అప్పగిస్తుంది: రాజస్థాన్‌లో  బీజేపీపై రాహుల్ ఫైర్

సారాంశం

రాజస్థాన్ రాష్ట్రంలోని  మాన్‌గర్ థామ్ లో  జరిగిన సభలో  రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో  ఆయన బీజేపీ విమర్శలు చేశారు.

న్యూఢిల్లీ: తాను మీ సైనికుడిని..ఢిల్లీలో ఉంటానని  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చెప్పారు.  మీరు ఎప్పుడంటే అప్పుడు రాజస్థాన్ కు  పిలవాలని  రాహుల్ గాంధీ గిరిజనులను కోరారు. మీకు తన వంతు సహాయం చేస్తానన్నారు.రాజస్థాన్ రాష్ట్రంలోని  బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ థామ్ లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  రాహుల్ గాంధీ ప్రసంగించారు.పుణ్యభూమికి అందరికి స్వాగతం అంటూ రాహుల్  గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  మాన్‌గర్‌ధామ్ లో బ్రిటిష్ వారితో  పోరాడి ప్రాణాలు అర్పించిన  గిరిజన సమాజానికి ధన్యవాదాలు తెలిపారు.  గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని  వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన నానమ్మ  ఇందిరా గాంధీ  బాల్యంలో తనకు  ఇచ్చిన పుస్తకం గురించి రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.ఈ పుస్తకం తనకు ఎంతో నచ్చిన పుస్తకంగా ఆయన  పేర్కొన్నారు.

మీరు అభివృద్ధి చెందకుండా  అడవిలో  జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని  రాహుల్ గాంధీ విమర్శించారు.  ఆదీవాసీలు  దేశానికి యజమానులని తాము నమ్ముతున్నామన్నారు. భూమిపై మీకు  హక్కుందన్నారు.  ఆదీవాసీల నుండి  భూములను లాక్కొని అదానీకి  అప్పగిస్తున్నారని  రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. గిరిజనులకు  కాంగ్రెస్ పార్టీ  భూమిపై హక్కులు కల్పించిందన్నారు. కానీ బీజేపీ వాటిని రద్దు చేసిందని  ఆయన  విమర్శించారు.

భారతదేశం  పూర్వం ఆదివాసీల భూమిగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సమాజం గిరిజనుల జీవితం నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.  మీ పిల్లలకు ఏం కావాలని కోరుకుంటున్నారో అది నిజం కావాలని తాము భావిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు.  మీరు అడవిలోనే ఉండాలని  మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావొద్దని  బీజేపీ కోరుకుంటుందని  రాహుల్ గాంధీ విమర్శించారు.

మణిపూర్ లో బీజేపీ భరతమాతను  హత్యచేసిందన్నారు.  ప్రధాని కావాలనుకుంటే  సైన్యాన్ని దింపి  ఈ గొడవలను నివారించే అవకాశం ఉందన్నారు. కానీ, మణిపూర్ ను రెచ్చగొట్టాలని  ప్రధాని భావిస్తున్నారని  రాహుల్ గాంధీ ఆరోపించారు.  ఇంత జరుగుతున్నా  మోడీ ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు. ఇవాళ పార్లమెంట్ లో  కూడ  ఇదే విషయాన్ని చెప్పానన్నారు.పేద ప్రజల కోసం  రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం  అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. పెన్షన్ పథకం ద్వారా 90 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని చెప్పారు.విద్వేషాల మార్కెట్ లో  ప్రేమ అనే దుకాణం నడుపుతున్నట్టుగా  భారత్ జోడో యాత్రలో తాను ప్రజలకు వాగ్దానం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం