
Amritpal Singh: ఖలిస్తాన్ మద్దతుదారు అమృతపాల్ సింగ్ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అమృతపాల్ కోసం గత 36 రోజులుగా కొనసాగిన అన్వేషణ నేటితో ముగిసింది. అమృతపాల్ అరెస్టుకు సంబంధించి పంజాబ్ ఐజీపీ సుఖ్చైన్ సింగ్ గిల్ సమాచారం ఇచ్చారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ అరెస్టు ప్రక్రియ మొత్తం సుఖ్చైన్ సింగ్ గిల్ చెప్పారు. అమృతపాల్ సింగ్ అరెస్ట్ తర్వాత పంజాబ్ పోలీసు అధికారి ఐజీపీ సుఖ్చైన్ సింగ్ గిల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఖలిస్తాన్ మద్దతుదారు అమృతపాల్ సింగ్ను ఆదివారం ఉదయం అరెస్టు చేసి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారనీ, అమృత్పాల్ సింగ్ లొంగిపోలేదని, అయితే అరెస్టు చేశారని ఐజీపీ హెడ్క్వార్టర్స్ డాక్టర్ సుఖ్చైన్ సింగ్ గిల్ తెలిపారు. కోర్టు జారీ చేసిన NSA కింద అమృతపాల్పై చర్యలు తీసుకున్నమన్నారు. రోడ్ గ్రామంలోని గురుద్వారాలో అమృతపాల్ సింగ్ ఉన్నట్లు తమకు నిర్దిష్ట సమాచారం ఉందని ఆయన చెప్పారు. అందిన సమాచారం మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గురుద్వారా సాహిబ్ గౌరవాన్ని కాపాడుతూ తాము అతనిని అరెస్టు చేసామని తెలిపారు. అమృత్పాల్ను అరెస్టు చేసిన అనంతరం అసోంలోని దిబ్రూఘర్కు తరలించినట్లు సుఖ్చైన్ సింగ్ గిల్ తెలిపారు. అమృత్సర్ పోలీసు ఇంటెలిజెన్స్ వింగ్, పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.
35 రోజులుగా ఆపరేషన్
గత 35 రోజులుగా అమృతపాల్ సింగ్ను పట్టుకోవడానికి ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈరోజు పక్కా సమాచారం సేకరించి మొత్తం ఆపరేషన్ చేపట్టారనీ, చట్ట ప్రకారం.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నైల్ సింగ్ భింద్రన్వాలా పేరుతో గురుద్వారా సాహిబ్ను నిర్మిస్తున్నారనే ప్రశ్నకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు ఫేక్ న్యూస్లను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం 6:45 గంటలకు రోడా గ్రామం నుంచి పట్టుబడ్డాడు. పంజాబ్ పోలీసులు , ఇంటెలిజెన్స్కు అతను రోడా గ్రామంలో ఉన్నాడని ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ కారణంగా గ్రామం అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడింది. అయితే అమృతపాల్ సింగ్ గురుద్వారా సాహిబ్లో దాక్కున్నాడు. గురుద్వారా సాహిబ్ గౌరవాన్ని పోలీసులు చూసుకున్నారు.
అన్ని వైపుల నుండి దిగ్బంధనం కారణంగా.. అమృతపాల్ సింగ్ తప్పించుకోవడానికి మార్గం లేదు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం అమృతపాల్ సింగ్ను భటిండా విమానాశ్రయం నుంచి విమానంలో అసోంలోని దిబ్రూఘర్ జైలుకు తీసుకువెళుతున్నారు. పంజాబ్ పోలీసులు అతనిపై గత 35 రోజులుగా ఒత్తిడి పెంచారు. మొత్తం ఆపరేషన్ సమయంలో శాంతిని కాపాడినందుకు పంజాబ్ ప్రజలకు ఐజిపి కృతజ్ఞతలు తెలిపారు.