ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన ట్రక్కు.. నలుగురు సజీవదహనం..

Published : Oct 17, 2023, 06:57 AM IST
ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన ట్రక్కు.. నలుగురు సజీవదహనం..

సారాంశం

మహారాష్ట్రలోని పూణె లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కు మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్రక్కు మరో వాహనం ఢీకొనడంతో కాలి బూడిదైంది.  

మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-బెంగళూరు హైవేపై సోమవారం ట్రక్కు మంటల్లో చిక్కుకోవడంతో మైనర్‌తో సహా నలుగురు సజీవదహనమయ్యారు, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సింహగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అభయ్ మహాజన్ మాట్లాడుతూ.. స్వామినారాయణ దేవాలయం సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. ప్రమాదానికి గురైన ట్రక్కు సాంగ్లీ నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. 

లారీ స్వామినారాయణ మందిర్ చౌక్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నియంత్రణ తప్పి వాహనం మరో లారీని ఢీకొని బోల్తా పడింది. ఆ తర్వాత వాహనం వెనుక నుంచి కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల మొక్కజొన్న పొట్టేలు తీసుకెళ్తున్న ట్రక్కులో మంటలు చెలరేగి డ్రైవర్ క్యాబిన్ దెబ్బతింది. క్యాబిన్‌లో కూర్చున్న ఆరుగురిలో నలుగురు లోపల చిక్కుకుని మరణించగా, ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చేరారు.

రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పూణే మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర పోత్‌ఫోడ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక వాహనాలు, వాటర్ ట్యాంకర్లను సంఘటనా స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలావుండగా, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించామని, త్వరలోనే హైవేను పునరుద్ధరిస్తామని ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu