ఆటో డ్రైవర్ తో లేచి పోయిన ప్రేయసి.. ఎలా పగతీర్చుకున్నాడంటే..

By telugu news teamFirst Published Aug 26, 2020, 2:00 PM IST
Highlights

దీంతో ఆసిఫ్‌  అహ్మదాబాద్‌లోని త‌న రెస్టారెంట్‌ను అమ్మేసి, ప్రేయసితోపాటు గ‌త‌ జూన్‌లో పూణేకు వచ్చాడు. 

ఆమెను అతను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే.. అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆమె అతనిని వదిలేసి మరో ఆటో డ్రైవర్ తో లేచిపోయింది. దీంతో జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా.. ఆటో డ్రైవర్లందరిపై పగ తీర్చుకోవడం మొదలుపెట్టాడు. దాదాపు 70 మంది  ఆటోడ్రైవర్ల స్మార్ట్‌ఫోన్‌లను చోరీచేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అహ్మదాబాద్ కి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆసిఫ్‌  అహ్మదాబాద్‌లోని త‌న రెస్టారెంట్‌ను అమ్మేసి, ప్రేయసితోపాటు గ‌త‌ జూన్‌లో పూణేకు వచ్చాడు. 

అయితే కొద్దిరోజుల తరువాత ఆసిఫ్‌ ప్రేయ‌సి అత‌ని డ‌బ్బులు తీసుకుని, తిరిగి అహ్మదాబాద్‌కు పారిపోయింది. అక్క‌డ ఆమె ఒక ఆటోడ్రైవర్‌ను వివాహం చేసుకుంది. దీంతో అసిఫ్ తీవ్ర ఆవేద‌న‌కు గురై, ప్రేయ‌సి మీద ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నాడు. అప్ప‌టి నుంచి ఆటోడ్రైవ‌ర్ల ఫోన్లు దొంగిలించ‌డం ప్రారంభించాడు. ఇందుకోసం ఆసిఫ్‌ ప్ర‌తిరోజూ ఆటోలో ప్ర‌యాణిస్తూ డ్రైవ‌ర్ల దృష్టి మ‌ర‌ల్చి, వారి ఫోన్ల‌ను చోరీ చేయసాగాడు. పోలీసుల విచారణలో అసిఫ్ తాను 70 ఫోన్లు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. 

నలుగురు ఆటో డ్రైవర్ల ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేయ‌గా.. ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

click me!