క్రీడలకు విశేష సేవలందించిన పీటీ ఉషకు కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్

Published : Mar 22, 2023, 04:17 PM IST
క్రీడలకు విశేష సేవలందించిన పీటీ ఉషకు కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్

సారాంశం

Kasaragod: క్రీడలకు విశేష సేవలందించిన ప‌రుగుల రాణి పీటీ. ఉషను కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించనుంది. కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తున్న తొలి గౌరవ డాక్టరేట్ ఇదే కావడం విశేషం.  

PT Usha gets honorary doctorate from Central University of Kerala: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, ప‌రుగుల రాణి పీటీ ఉష క్రీడారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అందుకోనున్నారు. క్రీడలకు విశేష సేవలందించిన పీటీ. ఉషను కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించనుందని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తున్న తొలి గౌరవ డాక్టరేట్ ఇదే కావడం విశేషం.

మైదానంలోనూ మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టే, తర్వాతి తరం క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అసమానమైన ఉనికిని కలిగి ఉన్న ఉష ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్షిప్ ల‌లో  19 స్వర్ణాలతో సహా 33 పతకాలు సాధించింది. వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించారు. 1985లో జకార్తా ఆసియా అథ్లెటిక్ మీట్ లో ఐదు స్వర్ణాలతో సహా ఆరు పతకాలు సాధించింది. ఆమెను తరచుగా "క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్" అని పిలుస్తారు. ప‌రుగుల రాణిగా దేశం గర్వించే ఎన్నో క్షణాలను అందించిన తార ఉష. ఆమె కినలూరులోని ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది సంవత్సరాలుగా అనేక విజయవంతమైన అథ్లెట్లను తయారు చేసింది. 20 ఏళ్ల తర్వాత ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ క్రీడాకారులు ఇప్పటివరకు భారత్ తరఫున 79 అంతర్జాతీయ పతకాలు సాధించారు. 

దేశంలో బలమైన అథ్లెటిక్ సంస్కృతికి బాటలు వేసిన మేధావిగా ఆమెకు గుర్తింపు ఉంది.  వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిన వారిని సన్మానించడం వర్సిటీ కర్తవ్యం అని తెలిపారు. పీటీ ఉష జీవితం, సాధించిన విజయాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో డాక్టరేట్ ప్రదానం చేయనున్న‌ట్టు తెలిపారు. పీటీ ఉషకు 2000లో కన్నూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డి.లిట్), 2017లో ఐఐటీ కాన్పూర్ గౌరవ డాక్టరేట్ (D.Sc), 2018లో కాలికట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డి.లిట్) ప్రదానం చేశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం