ప్రతి కుటుంబానికి ప్రాపర్టీ కార్డులు: మోడీ

By narsimha lodeFirst Published Oct 11, 2020, 12:01 PM IST
Highlights

: దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రాపర్టీ కార్డ్స్ (ఆస్తి కార్డులు) ఇవ్వనున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రాపర్టీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్రారంభించారు. 


న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రాపర్టీ కార్డ్స్ (ఆస్తి కార్డులు) ఇవ్వనున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రాపర్టీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్రారంభించారు. 

ఎస్వీఏఎంఐటీవీఏ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు తమ ఆస్తిని ఆర్ధిక ఆస్తిగా మార్చుకొనేందుకు ఈ కార్యక్రమం దోహాదపడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 1,32 వేల మంది భూములు కలిగిన వారికి కార్డులు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరితో ప్రధాని మోడీ ఇవాళ సంభాషించారు. 

A historic effort towards rural transformation. https://t.co/VYNk6nTcg6

— Narendra Modi (@narendramodi)

ఇవాళ ఆస్తుల హక్కులకు సంబంధించిన పత్రాలు పొందిన వారిని ప్రధాని అభినందించారు. గ్రామాల్లో నివసిస్తున్న వారిని స్వావలంభన దిశగా  తీసుకెళ్లేందుకు ఈ పథకం దోహాదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 


దేశంలోని 763 గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద లబ్దిదారులకు కార్డులు అందించనున్నారు. యూపీలో 346 గ్రామాలు , హర్యానాలో 221, మహారాష్ట్రలో 100, మధ్యప్రదేశ్ లో 44, ఉత్తరాఖండ్ లో 50, కర్ణాటక రాష్ట్రంలో రెండు గ్రామాల నుండి లబ్దిదారులున్నారు.

 

ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నారు. 2000 నుండి 2024 వరకు 6,62 గ్రామాలను ఈ పథకం కింద కవర్ చేయనున్నారు.  ఈ గ్రామాల ప్రజలు తమ ఆస్తులను ఆర్ధిక ప్రయోజనాలను తీసుకోవడానికి ఆర్ధిక ఆస్తిగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతోంది.

జాతీయ పంచాయితీ దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద డ్రోన్ల ద్వారా ఆస్తిని సర్వే చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని యజమానుల యాజమాన్యం యొక్క రికార్డులను సృష్టిస్తోంది.  బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికి ఈ కార్డులు ఉపయోగపడుతాయి. చాలా మందికి తమ ఆస్తులకు సంబంధించి యాజమాన్య పత్రాలు రికార్డులు లేనందున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 

click me!