భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాని మోడీ

Published : Aug 31, 2022, 06:02 AM IST
భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాని మోడీ

సారాంశం

భారత నావికాదళం: సెప్టెంబర్ 2న దేశీయంగా రూపొందించిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించనున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. భారత నావికాదళానికి సంబంధించిన కొత్త చిహ్నాన్ని ఆవిష్కరిస్తారని పీఎంవో మంగళవారం  వెల్ల‌డించింది.   

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ: భార‌త‌ నావికాదళ కొత్త జెండాను సెప్టెంబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నట్లు ఆయన కార్యాలయం మంగళవారం వెల్లడించింది. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆవిష్కరణ జరుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. ప్ర‌ధాని మోడీ  "కలోనియల్ గతాన్ని దూరం చేస్తూ కొత్త నౌకాదళ ఎన్సైన్ (నిషాన్)ని ఆవిష్కరిస్తాడని" PMO ఒక ప్రకటనలో పేర్కొంది.  కొత్త జెండా "సంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినది ఉంటుందని" పేర్కొంది. కాగా, జనవరి 26, 1950 నుండి నాల్గవ సారి ఇలా మార్పు చేయ‌డం జ‌రిగింది. 

ప్ర‌స్తుతం భార‌త నావికాద‌ళం చిహ్నంలో రెండు ఎరుపు చారల కూడలిలో భారతీయ చిహ్నం ప్రదర్శించబడుతుంది. ఎరుపు క్షితిజ సమాంతర-నిలువు చారలతో తెల్లటి జెండాతో ఖండంలో త్రివర్ణ పతాకం ఉంటుంది. కొత్త ఎన్‌సైన్‌పై ఎలాంటి వివరాలు లేనప్పటికీ, ఇది ప్రస్తుత 'క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్' - తెల్లని నేపథ్యంలో ఉన్న రెడ్ క్రాస్‌ను తొలగించే అవకాశం ఉంది. భారతదేశ విభజనతో, స్వాతంత్య్రం తర్వాత, రాయల్ ఇండియన్ నేవీ రాయల్ ఇండియన్ నేవీ, రాయల్ పాకిస్థాన్ నేవీగా విభజించబడింది. జనవరి 26, 1950న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించడంతో 'రాయల్' అనే ప‌దాన్ని తొల‌గించారు. దానిని ఇండియన్ నేవీగా పేరు మార్చారు.

సెయింట్ జార్జ్ శిలువకు ప్రతీకగా ఉండే క్షితిజ సమాంతర-నిలువు ఎరుపు చారలు వలసరాజ్యాల యుగాన్ని గుర్తుకు తెస్తాయి. కొత్త చిహ్నం కోసం రూపొందించిన డిజైన్‌లో తొలగించబడే అవకాశం ఉంది. 26 జనవరి 1950న, యాంకర్‌తో చిత్రీకరించబడిన నౌకాదళ చిహ్నంలోని కిరీటం, భారత నౌకాదళ చిహ్నం కోసం అశోకన్ లయన్‌తో భర్తీ చేయబడింది. కాగా, ఇండో-పసిఫిక్ మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడంలో INS విక్రాంత్ దోహదపడుతుందని భారత నావికాదళ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ SN ఘోర్మాడే తెలిపారు. 

భారత నావికాదళం చిహ్నంలో మార్పుల ఇలా..:

- 1950లో, యాంకర్‌తో చిత్రీకరించబడిన నౌకాదళ చిహ్నంలోని కిరీటం, భారత నౌకాదళ చిహ్నం కోసం అశోకన్ లయన్‌తో భర్తీ చేయబడింది.

- 2001 వరకు, రెడ్ సెయింట్ జార్జ్ క్రాస్ అలాగే ఉంచబడింది కానీ తర్వాత నేవీ బ్లూ కలర్ ఇండియన్ నేవీ క్రెస్ట్‌ని తీసుకురావడానికి తొలగించబడింది.

- 2004లో, సెయింట్ జార్జ్ క్రాస్ క్రాస్ కూడలి వద్ద అశోక చిహ్నంతో తిరిగి చేర్చారు. 2001లో జోడించిన నావికాదళ చిహ్నం తొలగించబడింది.

- 2014లో అశోక్ చిహ్నం కింద జాతీయ నినాదం “సత్యమేవ జయతే” నే చేర్చారు. ఇది ఇప్పటికే ఉన్న చిహ్నంగా మారింది. అశోక చిహ్నం క్రింద 'సత్యమేవ జయతే' అనే పదాలతో సమాంతర-నిలువు గీతలతో తెల్లటి జెండా- కుడి ఎగువ మూలలో ఉంచబడిన త్రివర్ణ పతాకం ఉంటుంది. 

- మరోసారి ఇండియన్ నేవీ జెండాలో మార్పులు చేయబోతున్నారు. ప్రధాని మోడీ కొత్త జెండాను కొచ్చిలో ఆవిష్కరించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu