బీజేపీలో చేరాలని ఒత్తిడి.. లేకపోతే నెల రోజుల్లో అరెస్ట్ చేస్తారట - ఢిల్లీ మంత్రి అతిషి

Published : Apr 02, 2024, 01:20 PM ISTUpdated : Apr 02, 2024, 01:21 PM IST
బీజేపీలో చేరాలని ఒత్తిడి.. లేకపోతే నెల రోజుల్లో అరెస్ట్ చేస్తారట - ఢిల్లీ మంత్రి అతిషి

సారాంశం

బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి వస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఆ పార్టీలో చేరకపోతే ఈడీ తనను నెల రోజుల్లో అరెస్ట్ చేస్తుందని హెచ్చరికలు వస్తున్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోరని అన్నారు.

తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే బీజేపీలో చేరాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. అలా చేయకపోతే తనను నెల రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెబుతున్నారని అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని ఓ సన్నిహితుడి ద్వారా ఆ పార్టీ తనను సంప్రదించిందని అన్నారు. అందులో చేరకపోతే మరో నెల రోజుల్లో తనను ఈడీ అరెస్టు చేస్తుందని హెచ్చరించారని ఆరోపించారు.

లోక్ సభ ఎన్నికలకు రెండు నెలల ముందు మరో నలుగురు ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను అరెస్టు చేస్తారని అతిషి తెలిపారు.‘‘ఏడాదిన్నరగా ఈడీ, సీబీఐల వద్ద ఉన్న వాంగ్మూలం ఆధారంగా సౌరభ్ భరద్వాజ్, నా పేరును ఈడీ కోర్టుకు తీసుకెళ్లింది. ఈ స్టేట్మెంట్ కూడా సీబీఐ ఛార్జీషీట్లలో ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే ? అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ జైలులో ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఐక్యంగా, బలంగా ఉందని బీజేపీ భావించడమే ఈ ప్రకటనను లేవనెత్తడానికి కారణం. ఇప్పుడు వారు ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి నాయకత్వాన్ని జైలులో పెట్టాలని యోచిస్తున్నారు...'' అని అతిషి పేర్కొన్నారు.

కాగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తారా అని అతిషిని మీడియా ప్రశ్నించింది. ‘‘మన దేశంలో దీనికి సంబంధించి రెండు రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లకు మించి శిక్ష పడితే ప్రజాప్రతినిధిగా ఉండలేరని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోంది. అరవింద్ కేజ్రీవాల్ కు శిక్ష పడలేదు... ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు మెజారిటీ ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తే, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడానికి భారతీయ జనతా పార్టీకి ఇది చాలా సరళమైన, సూటి పరిష్కారం అవుతుంది.’’ అని అన్నారు. 

ఇదిలా ఉండగా.. పార్టీలో చేరకపోతే ఈడీ అరెస్టు చేస్తుందన్న అతిషి వ్యాఖ్యలపై బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది నళిన్ కోహ్లీ స్పందించారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ తన పేరును, సౌరభ్ భరద్వాజ్ పేరును తీసుకుని మధ్యవర్తులు తమను కలిసేవారని అతిషి ఆందోళన చెందుతోంది. అదే నిజమైతే సొంత నేతే వారి వైపు వేలు చూపిస్తున్నారు. ఆయన ఇద్దరు సహచరులు, ఇతర మంత్రులు ఇప్పటికే జైలులో ఉన్నారు. ఇప్పటికే ఆయన రాజీనామా తీసుకున్నారు. బహుశా ఈ మంత్రులను తొలగించడానికి ఆయన మదిలో మరేదైనా ప్రణాళికలు ఉండవచ్చు. కానీ అడిగే ప్రశ్నలు అడగరనే ఆశతో బీజేపీపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలతో విరుచుకుపడటం కుదరదు. అంతిమంగా ఢిల్లీలో మద్యం కుంభకోణంపై వారు సమాధానం చెప్పాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు సంస్థ కొన్ని విశ్వసనీయ ఆధారాలను సేకరించినట్లు కనిపిస్తోంది’’ అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu